అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో కాల్పులు చోటు చేసుకోవడం కలకలం రేపింది. మేడ్చల్ (Medchal) జిల్లా పోచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోచారంలో ప్రశాంత్ సింగ్ సోనూ అనే వ్యక్తిపై నిందితుడు కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఇబ్రహీంగా గుర్తించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. గాయపడ్డ ప్రశాంత్ సింగ్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే కాల్పులు ఎందుకు జరిపాడనే వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.
కాగా హైదరాబాద్ నగరంలో ఇటీవల నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఓ వైపు డ్రగ్స్ దందా సాగుతుండగా.. హత్యలు సైతం పెరిగిపోయాయి. గతంలో దోపిడీ దొంగలు గన్లతో బెదిరించి చందానగర్లో ఓ బంగారం దుకాణంలో చోరీ చేశారు. ఇటీవల మెట్రో స్టేషన్లో ఓ వ్యక్తి వద్ద బుల్లెట్ దొరకడం కలకలం రేపింది. తాజాగా పోచారంలో కాల్పులు చోటు చేసుకోవడంతో శాంతిభద్రతలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా గన్ కల్చర్ పెరుగుతుండటంపై కలవర పడుతున్నారు.