Homeతాజావార్తలుMedak | భూ వివాదంలో తుపాకీ కలకలం

Medak | భూ వివాదంలో తుపాకీ కలకలం

భూ వివాదం నేపథ్యంలో డమ్మీ గన్​తో బెదిరింపులకు పాల్పడిన ఘటన మెదక్​ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, మెదక్ : Medak | భూ వివాదం నేపథ్యంలో తుపాకీతో బెదిరింపులకు పాల్పడేందుకు యత్నించిన ఘటన మెదక్​ జిల్లా హవేలి ఘన్​పూర్​ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు ఎల్లంకు, హైదరాబాద్​ (Hyderabad)కు చెందిన వ్యక్తితో కొంతకాలంగా భూ వివాదం ఉంది.

భూ వివాదంపై మెదక్ జిల్లా కోర్టు నుంచి ఎల్లం ఇంజెక్షన్​ ఆర్డర్​ (Injection Order) తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో గురువారం పంట కోయడానికి వెళ్లాడు. అయితే హైదరాబాద్​కు చెందిన వ్యక్తి అనుచరులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ నాగ్​పూర్​ (Nagpur) గ్రామానికి చెందిన వ్యక్తి గన్​తో ఉండటం కలకలం రేపింది. సదరు వ్యక్తిని అనుమానంతో తనిఖీ చేస్తే తుపాకీ లభించింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Medak | డమ్మీ గన్​..

హవేలి ఘన్​పూర్​ పోలీసులు (Ghanpur Police) ఘటన స్థలానికి చేరుకొని గన్​ స్వాధీనం చేసుకున్నారు. దానిని పరిశీలించగా.. డమ్మీ గన్​ (Dummy Gun) అని తేలింది. అయితే డమ్మీ గన్​తో బెదిరింపులకు పాల్పడేందుకు సదరు వ్యక్తి యత్నించాడని పోలీసులు తెలిపారు. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ వివాదంలో ఇరువురి మధ్య పలు మార్లు గొడవలు జరిగాయి. దీంతో తనను చంపుతానని బెదిరించినట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.