HomeతెలంగాణKTR | రాష్ట్రంలో గన్​ కల్చర్​.. సీఎంపై కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

KTR | రాష్ట్రంలో గన్​ కల్చర్​.. సీఎంపై కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

KTR | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ సీఎం రేవంత్​రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అగ్రికల్చర్​ పోయి, గన్​ కల్చర్​ వచ్చిందని ఆరోపించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) పై మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కమీషన్ల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అగ్రికల్చర్‌ పోయి.. గన్‌ కల్చర్‌ వచ్చిందన్నారు.

తెలంగాణ భవన్ (Telangana Bhavan)​లో గురువారం కేటీఆర్​ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో గన్​ కల్చర్​ వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్​రెడ్డి తుపాకి ఇచ్చారని స్వయంగా మంత్రి కొండా సురేఖ కూతురు చెప్పారని గుర్తు చేశారు. మరోవైపు పోలీసులు ఏమో కొండా మురళి తుపాకి ఇస్తే సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్​ బెదించాడని అంటున్నారని చెప్పారు. అయితే బెదిరించిన మాట వాస్తవమే కదా అని ఆయన అన్నారు. నిందితుడిని స్వయంగా మంత్రి తీసుకుపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించలేదన్నారు.

KTR | భయపడుతున్న అధికారులు

సీఎం రేవంత్​రెడ్డి పాలనలో అధికారులు భయపడుతున్నారని కేటీఆర్​ అన్నారు. కాంగ్రెస్‌ నేతలు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. మంత్రుల తీరుతో ఎక్సైజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రిజ్వీ పదేళ్ల సర్వీస్​ ఉండగా.. వీఆర్​ఎస్​ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. మంత్రులు చేసే తప్పులకు బలి కావొద్దని కేటీఆర్​ అధికారులకు సూచించారు. కాంగ్రెస్​ అరాచకాలకు వత్తాసు పలికితే తప్పకుండా శిక్ష పడుతుందని ఆయన హెచ్చరించారు. ఐఏఎస్ అధికారులు రాజీనామా చేస్తుంటే, పారిశ్రామికవేత్తలను తుపాకులు పెట్టి బెదిరిస్తుంటే.. బీజేపీ (BJP) ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.