అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్లో (Rajendranagar)గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS ) పోలీసులు అర్ధరాత్రి సోదాలు చేశారు. ఫోర్త్ వ్యూ కాలనీలోని డాక్టర్ సయ్యద్ మొహియుద్దీన్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు.
ఉగ్రవాద ఆరోపణలతో డాక్టర్ సయ్యద్ను గుజరాత్ పోలీసులు (Gujarat Police) ఇదివరకే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రమాకర విషం రెసిన్ తయారు చేసి సామూహిక హత్యలకు సయ్యద్ కుట్ర పన్నినట్లు గుర్తించారు. ఈక్రమంలో అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి, ఐదుగురు సభ్యుల బృందం మంగళవారం అర్ధరాత్రి అతడి ఇంట్లో సోదాలు చేపట్టింది.
Hyderabad | సామగ్రి సీజ్
సయ్యద్ ఇంట్లో మూడు రకాల లిక్విడ్తో పాటు కంప్యూటర్, పలు రకాల బుక్స్, ఆయిల్ తయారుచేసే మిషన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలు కీలక డాక్యుమెంట్లను సైతం గుర్తించారు. సయ్యద్ సోదరుడు ఓమర్ ఫారుఖీకి నోటీసులు ఇచ్చి తనిఖీలు చేపట్టారు. ఆ సామగ్రిని సీజ్ చేసి గుజరాత్ తీసుకెళ్లారు. అయితే సోదాలపై ఒమర్ ఫారూఖీ మాట్లాడారు. తమ ఇంట్లో మంగళవారం రాత్రి గుజరాత్ పోలీసులు సోదాలు చేపట్టారని చెప్పారు. మరోసారి దాడులు చేశారనేది అవాస్తవం అన్నారు. రాజేంద్రనగర్లోని పిల్లర్ నంబర్ 122 వద్ద తమ మొహయోద్దీన్ హోటల్ గెలాక్సీ (Hotel Galaxy)లో షవర్మ బిజినెస్ చేశాడు. దీంతో పోలీసులు అక్కడ కూడా తనిఖీలు చేపట్టారని ఫారుఖీ తెలిపారు.
