అక్షరటుడే, వెబ్డెస్క్ : GST | జీఎస్టీ gst వసూళ్లలో రికార్డు నమోదైంది. ఏప్రిల్ aprilలో రూ.2.37 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో వసూలైనట్లు కేంద్రం తెలిపింది. గతేడాది ఇది రూ.2.10 లక్షల కోట్లుగా ఉంది. జీఎస్టీ చరిత్రలోనే ఈ ఏడాది ఏప్రిల్లో అత్యధికంగా జీఎస్టీ వసూలు కావడం గమనార్హం. కాగా మార్చి marchలో జీఎస్టీ వసూళ్లు 1.96 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
దేశంలో 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. తొలి నెల రూ.92వేల కోట్లు వసూళ్లు నమోదయ్యాయి. తర్వాత మెళ్లిగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు కోవిడ్ సమయంలో తగ్గిపోయాయి. మళ్లీ 2022 ఏప్రిల్లో రూ.1.67 లక్షల కోట్లకు పెరిగాయి. తొలిసారి 2024 ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లు మార్కు దాటగా, ఈ ఏడాది ఏప్రిల్లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు అయింది.