Homeజిల్లాలుకామారెడ్డిBanswada | ఘనంగా ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠాపన

Banswada | ఘనంగా ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠాపన

బాన్సువాడ మండలంలోని రాంపూర్​ గ్రామంలో నిర్మించిన ఆలయంలో ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం, ఆగ్రోస్​ ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ కాసుల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | బాన్సువాడ మండలం చిన్న రాంపూర్ గ్రామంలో (Chinna Rampur village) నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ స్థిర ప్రతిష్ఠాపన నిర్వహించారు. ఎస్‌డీఎఫ్ నిధులతో నిర్మించిన ఆలయంలో సోమవారం ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమం, యజ్ఞంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి (MLA Pocharam Srinivasa Reddy), ఆగ్రో ఇండస్ట్రీస్​ ఛైర్మన్ కాసుల బాలరాజు (Kasula Balaraju) పాల్గొన్నారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు అందిస్తుందని, గ్రామస్థులు భక్తి మార్గంలో పయనించాలని పోచారం సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంజయ్య, మోహన్ రెడ్డి, గణేష్, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.