HomeతెలంగాణAIKMS| ధాన్యాన్ని తక్షణమే రైస్​మిల్లులకు తరలించాలి

AIKMS| ధాన్యాన్ని తక్షణమే రైస్​మిల్లులకు తరలించాలి

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్​: AIKMS | కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని తక్షణమే రైస్​మిల్లులకు తరలించాలని ఏఐకేఎంఎస్​(AIKMS) నాయకులు డిమాండ్​ చేశారు. జక్రాన్​పల్లి (Jakranpalli) మండలంలోని అర్గుల్​ రైతు సహకారం సంఘం పరిధిలోని అర్గుల్​, సికింద్రాబాద్​, పుప్పాలపల్లి గ్రామాల్లో ధాన్యం కుప్పలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి మొలకలు వస్తున్నాయన్నారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు​ కలెక్టర్​ మాత్రమే స్పందించి ధాన్యాన్ని తరలించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన వారిలో ఏఐకేఎంఎస్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్​, కార్యదర్శి దేవరాం, నిజామాబాద్​ రూరల్​, కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ప్రతినిధులు తదితరులున్నారు.

Must Read
Related News