ePaper
More
    HomeతెలంగాణAIKMS| ధాన్యాన్ని తక్షణమే రైస్​మిల్లులకు తరలించాలి

    AIKMS| ధాన్యాన్ని తక్షణమే రైస్​మిల్లులకు తరలించాలి

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్​: AIKMS | కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని తక్షణమే రైస్​మిల్లులకు తరలించాలని ఏఐకేఎంఎస్​(AIKMS) నాయకులు డిమాండ్​ చేశారు. జక్రాన్​పల్లి (Jakranpalli) మండలంలోని అర్గుల్​ రైతు సహకారం సంఘం పరిధిలోని అర్గుల్​, సికింద్రాబాద్​, పుప్పాలపల్లి గ్రామాల్లో ధాన్యం కుప్పలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి మొలకలు వస్తున్నాయన్నారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు​ కలెక్టర్​ మాత్రమే స్పందించి ధాన్యాన్ని తరలించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన వారిలో ఏఐకేఎంఎస్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్​, కార్యదర్శి దేవరాం, నిజామాబాద్​ రూరల్​, కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ప్రతినిధులు తదితరులున్నారు.

    More like this

    Asia Cup | బోణీ కొట్టిన ఆఫ్ఘ‌నిస్తాన్.. ఆదుకున్న అటల్ , అజ్మతుల్లా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | గ‌త రాత్రి ఆసియా కప్‌–2025 అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. తొలి మ్యాచ్‌లో...

    Indian Railway Jobs | పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Railway Jobs | భారతీయ రైల్వేలో (Indian Railway) ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి...

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...