ePaper
More
    HomeతెలంగాణNizamabad collector | ధాన్యం కొనుగోళ్లు సజావుగా చేపట్టాలి

    Nizamabad collector | ధాన్యం కొనుగోళ్లు సజావుగా చేపట్టాలి

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Nizamabad collector | ధాన్యం కొనుగోళ్లు సజావుగా చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanthu) అన్నారు. మంగళవారం ఆర్మూర్​లోని ధోబీఘాట్, కమ్మర్​పల్లి మండలం ఉప్లూర్, మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను(Purchase centers) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల(Farmers) నుంచి ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం, మిల్లులకు తరలించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

    ధోబీఘాట్ కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని రైతులు కలెక్టర్ దృష్టికి తేగా, నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యానికి తావిచ్చే సొసైటీలకు వచ్చే సీజన్​లో కేంద్రాలను కేటాయించవద్దని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయన వెంట ఆర్డీవో రాజాగౌడ్, డీఎస్​వో అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయ్స్​ డీఎం శ్రీకాంత్ రెడ్డి, డీసీవో శ్రీనివాస్, డీపీఎం సాయిలు, తదితరులున్నారు.

    More like this

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...