GPO Association | సమస్యల పరిష్కారానికే జీపీవోల ఆవిర్భావ సభ

అక్షరటుడే, కామారెడ్డి: GPO Association | జీపీవోల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికే జీపీవోల ఆవిర్భావ సభ (GPO formation meeting) ఏర్పాటు చేయడం జరిగిందని ఆ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ చిరంజీవి ముదిరాజ్ తెలిపారు. పట్టణంలో శనివారం సాయంత్రం ఆయన పట్టణంలోని ఆర్​అండ్​బీ గెస్ట్​హౌస్​లో మీడియాతో మాట్లాడారు. ఈనెల 23న హైదరాబాద్​లోని (Hyderabad) సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గ్రామ పరిపాలన ఉద్యోగ అసోసియేషన్ నూతన ఆవిర్భావ సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జీపీవో ఉద్యోగుల హక్కుల […]

అక్షరటుడే, కామారెడ్డి: GPO Association | జీపీవోల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికే జీపీవోల ఆవిర్భావ సభ (GPO formation meeting) ఏర్పాటు చేయడం జరిగిందని ఆ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ చిరంజీవి ముదిరాజ్ తెలిపారు.

పట్టణంలో శనివారం సాయంత్రం ఆయన పట్టణంలోని ఆర్​అండ్​బీ గెస్ట్​హౌస్​లో మీడియాతో మాట్లాడారు. ఈనెల 23న హైదరాబాద్​లోని (Hyderabad) సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గ్రామ పరిపాలన ఉద్యోగ అసోసియేషన్ నూతన ఆవిర్భావ సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జీపీవో ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఈ సభలో చర్చిస్తామన్నారు.

ఈ ఆవిర్భావ సభకు ముఖ్య అతిథులుగా రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.అచ్చిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ హాజరవుతారని పేర్కొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి జీపీవోలు అధికసంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జేపీవోలు మాణిక్యం, సూరజ్ కుమార్, సంజీవులు, అశోక్, భాస్కర్, రాజు, సాయిలు, రవి, సంతోష్ రెడ్డి, ప్రవీణ పాల్గొన్నారు.

Related articles

Kamareddy Education Demand | కామారెడ్డిలో విద్యాసంస్థల ఏర్పాటుపై దృష్టి పెట్టండి.. విద్యార్థి సంఘాల సూచన

ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాల్లో విద్యాసంస్థల ఏర్పాటుకు నాయకులు కృషి చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం మీడియాతో మాట్లాడారు.

Stock Market Crash | బేర్ దెబ్బకు కుదేలైన స్టాక్ మార్కెట్.. రూ. 2.71 లక్షల కోట్ల సంపద ఆవిరి

స్టాక్ మార్కెట్‌పై బేర్ పంజా విసిరింది. దీంతో అన్ని రంగాలూ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. సెన్సెక్స్ 1,145 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 288 పాయింట్ల నష్టంతో ముగిశాయి.

Mudhiraj Mahasabha Appointment | రాష్ట్ర ముదిరాజ్ మహాసభ బాన్సువాడ ఇన్​ఛార్జీగా మంత్రి గణేష్ నియామకం

తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ బాన్సువాడ నియోజకవర్గ ఇన్​ఛార్జీగా బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన మంత్రి గణేష్ నియమితులయ్యారు. ఆయనకు మంగళవారం నియామకపత్రం అందజేశారు.

AI Summit Protest | ఏఐ సదస్సులో ఆందోళన ఘటన.. ఢిల్లీ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి అరెస్ట్‌

ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌లో యూత్‌ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది