ePaper
More
    HomeతెలంగాణGovernor Jishnu Dev Varma | జిల్లా ప్రముఖులతో గవర్నర్ ఇష్టాగోష్టి..

    Governor Jishnu Dev Varma | జిల్లా ప్రముఖులతో గవర్నర్ ఇష్టాగోష్టి..

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Governor Jishnu Dev Varma | రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్​ను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​లో జిల్లాకు చెందిన ఆయా రంగాల్లో ప్రఖ్యాతిగాంచిన కవులు, కళాకారులు, రచయితలు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలతో ఇష్టాగోష్టి నిర్వహించారు.

    తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కలెక్టరేట్​కు విచ్చేశారు. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి(MLA Sudarshan Reddy), భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy), ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta), రాకేశ్​ రెడ్డి (MLA Rakesh Reddy), కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya), అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి తదితరులు పూల బొకేలు అందించి స్వాగతం పలికారు.

    READ ALSO  IAS Postings | ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలువురు ఐఏఎస్​లకు సబ్​ కలెక్టర్లుగా పోస్టింగ్​

    Governor Jishnu Dev Varma | పథకాల అమలుపై ఫొటో ఎగ్జిబిషన్​..

    జిల్లాలో ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరును ప్రతిబింబించేలా ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్​ను గవర్నర్ తిలకించారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఫొటోల ఆధారంగా ఆయా శాఖల కార్యక్రమాల వివరాలను తెలిపారు. జిల్లాలో అమలవుతున్న పథకాల తీరును వివరించారు. ఈ మేరకు గవర్నర్ ఫొటో ఎగ్జిబిషన్​ను ఆసక్తిగా తిలకించారు.

    Governor Jishnu Dev Varma | ఆయా రంగాల్లో ప్రముఖులతో భేటీ..

    ఆయా రంగాల్లో సేవలందిస్తున్న ప్రముఖులతో గవర్నర్ చర్చించారు. చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ (Malavat Purna), అంతర్జాతీయ ఫుట్​బాల్​ క్రీడాకారిణి సౌమ్య (International footballer Soumya), కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (Central Sahitya Akademi) గ్రహీత రమేష్ కార్తీక్ నాయక్​లతో మాట్లాడారు. వీరి అనుభవాలను, ఎదుర్కొన్న కష్టాలను గవర్నర్​కు వివరించారు. అలాగే చరిత్రకారులు, ఆదర్శ రైతు, రచయితలు, కవులు, జానపద కళాకారులు, వాయిద్య కారులు, అష్టావధాని, సాహితీ పరిశోధకులు, విద్యావేత్తలు, చిత్రకారులు తదితర 40 మంది ప్రముఖులతో చర్చ గోష్టి జరిపారు. అనంతరం వారితో పాటు జిల్లా అధికారులతో కలిసి ఫొటో సెషన్​లో పాల్గొన్నారు.

    READ ALSO  CP Sai Chaitanya | పోలీసు శాఖ ఇమేజ్ పెంచేలా సిబ్బంది పనిచేయాలి

    Governor Jishnu Dev Varma | ఉదయం నుంచి బిజీ బిజీగా..

    రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మొదటిసారి జిల్లా పర్యటనకు విచ్చేశారు. మొదటగా ఉదయం డిచ్​పల్లిలోని పోలీసు బెటాలియన్​కు చేరుకున్నారు. అక్కడి నుంచి తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన రెండవ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ పలువురికి బంగారు పతకాలు, పట్టాలను ప్రదానం చేశారు. భోజన విరామం అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​కు చేరుకొని పలువురు ప్రముఖులతో ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీబిజీగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

    గవర్నర్​తో మాట్లాడుతున్న మాలావత్​ పూర్ణ, ఫుట్​బాల్​ క్రీడాకారిణి గుగ్లోత్​ సౌమ్య

    గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మతో కలెక్టర్​, సీపీ, ఇతర అధికారులు

    Latest articles

    Telangana University | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్​ కాలేజీ !

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Telangana University | ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad)​ జిల్లా విద్యార్థుల కల నెరవేరబోతుంది. అన్ని...

    Sirikonda | అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

    అక్షరటుడే, ఇందల్వాయి: Sirikonda | సిరికొండ మండలంలోని మైలారం శివారులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు....

    Bharosa Center | మహిళలు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం: సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bharosa Center | బాధిత మహిళలకు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం పనిచేస్తుందని సీపీ...

    Case on PAYTM | పేటీఎంపై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Case on PAYTM | ప్రముఖ డిజిటల్​ చెల్లింపుల కంపెనీ పేటీఎం (paytm), దాని...

    More like this

    Telangana University | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్​ కాలేజీ !

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Telangana University | ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad)​ జిల్లా విద్యార్థుల కల నెరవేరబోతుంది. అన్ని...

    Sirikonda | అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

    అక్షరటుడే, ఇందల్వాయి: Sirikonda | సిరికొండ మండలంలోని మైలారం శివారులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు....

    Bharosa Center | మహిళలు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం: సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bharosa Center | బాధిత మహిళలకు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం పనిచేస్తుందని సీపీ...