HomeతెలంగాణHyderabad | ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైదరాబాద్​లో మరో బస్టాండ్​ నిర్మాణం

Hyderabad | ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైదరాబాద్​లో మరో బస్టాండ్​ నిర్మాణం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో ప్రస్తుతం రెండు బస్టాండ్లు అందుబాటులో ఉన్నాయి. మహాత్మ గాంధీ బస్​ స్టేషన్​ (ఎంజీబీఎస్​) (Mahatma Gandhi Bus Station), జూబ్లీ బస్టాండ్​ (జేబీఎస్​) (Jubilee Bus Stand) ఉన్నాయి. ఈ రెండు ప్రయాణ ప్రాంగణాల నుంచే రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నడుస్తాయి. అయితే నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. ఈ క్రమంలో రద్దీ కూడా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం మహా నగరంలో మరో బస్టాండ్​ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ (Transport Minister Ponnam Prabhakar) ఓ టీవీ చానెల్​తో కొత్త బస్టాండ్​ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్​ నగరంలో (Hyderabad city) మొదట ఎంజీబీఎస్ ఏర్పాటు చేశారు. ఇది నగరం మధ్యలో ఉంటుంది. దీనిని ఇమ్లిబన్​ బస్టాండ్​ అని కూడా పిలుస్తారు. ఇది దేశంలోనే ఐదో పెద్ద బస్టాండ్​ కావడం గమనార్హం. అయితే ఎంజీబీఎస్​ నగరంలో మధ్యలో ఉండడంతో రద్దీ తగ్గించడానికి జేబీఎస్​ ఏర్పాటు చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే బస్సులు ఎక్కువ శాతం జేబీఎస్​ వరకు నడుస్తాయి. అయితే ప్రస్తుతం నగరంలో జనాభా పెరగడంతో మరో బస్టాండ్​ నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నట్లు పొన్నం ప్రభాకర్​ తెలిపారు.

Hyderabad | ఆరాంఘర్​ ప్రాంతంలో..

మహబూబ్​నగర్, నల్గొండ, వికారాబాద్​​ వైపు వెళ్లే ప్రజల సౌకర్యార్థం ప్రస్తుతం బస్టాండ్​ నిర్మించాలని యోచిస్తున్నట్లు పొన్నం తెలిపారు. ఆరాంఘర్​ ప్రాంతంలో నిర్మించాలని ప్రణాళిక రూపొందించామన్నారు. ఆ ప్రాంతం కాకపోతే మరో ప్రాంతంలో అయిన శంషాబాద్​ ఎయిర్​ పోర్టుకు (Shamshabad Airport) దగ్గరగా ఉండేలా బస్టాండ్​ నిర్మిస్తామన్నారు. అన్ని వసతులతో దీనిని ఏర్పాటు చేస్తామన్నారు. ఫోర్త్​ సిటీలో కూడా బస్టాండ్​, బస్​డిపో ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. బస్సుల రద్దీ పెరగడంతో ఆ మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.