అక్షరటుడే, ఇందూరు: CITU Nizamabad | అంగన్వాడీలకు (Anganwadi teachers) ఉద్యోగ భద్రత కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపించట్లేదని సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు శంకర్ గౌడ్, నూర్జహాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా మహాసభ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారిద్దరు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులు, స్కీం వర్కర్లను ఉద్యోగులుగా కార్మికులుగా గుర్తించకపోవడంతో ఉద్యోగ భద్రత లేకుండాపోయిందన్నారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. కార్మిక చట్టాలు వర్తించక శ్రమదోపిడీకి గురవుతున్నారని తెలిపారు.
పదవీవిరమణ పొందిన అంగన్వాడీ ఉద్యోగులకు రిటైర్మెంట్, బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షుడు రమేష్ బాబు, యూనియన్ జిల్లా నాయకులు చంద్రకళ, మంగాదేవి, సూర్యకళ, రాజ్యలక్ష్మి, వాణి, గోదావరి, జ్యోతి, జగదాంబ పాల్గొన్నారు.
