ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిCrop Damage | నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

    Crop Damage | నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

    Published on

    అక్షరటుడే, డోంగ్లి: Crop Damage | ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలో 3,200 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని డోంగ్లి (Dongli) మండల కాంగ్రెస్​ సీనియర్​ నాయకులు గజానంద్​ దేశాయ్​ పేర్కొన్నారు.

    ఈ మేరకు మంగళవారం వరదల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంటనష్టంపై ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (Mla Thota laxmi kantha Rao) అధికారులతో సమీక్షలు నిర్వహించారన్నారు.

    మండల నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో నష్టపోయిన పంట పొలాలకు ఎమ్మెల్యే ఇదివరకే పరిశీలించారన్నారు. నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా తప్పిపోకుండా నిర్దిష్టమైన ప్రణాళికతో నివేదికలు అందించాలని ఆదేశించారన్నారు.

    ఎమ్మెల్యే ఆదేశాల మేరకు తాము వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలనకు వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు ప్రభుత్వం ఆదుకుంటుందని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. మాజీ ఎంపీటీసీ దీన్ దయాల్, నాయకులు గైక్వాడ్ విలాస్, ఏఈవో గజానంద్, మండల రైతులు తదితరులున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...