Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | పీహెచ్​డీ సాధించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

Kamareddy | పీహెచ్​డీ సాధించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

కామారెడ్డి పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు షకీల్​ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి హిందీలో పీహెచ్​డీ సాధించారు. షకీల్​ ప్రస్తుతం రామారెడ్డి మండలం పోసానిపేట ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | రామారెడ్డి మండలం పోసానిపేట ప్రభుత్వ పాఠశాలలో (Posanipet Government School) ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మహమ్మద్ షకీల్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్​డీ పట్టా పొందాడు. కామారెడ్డి పట్టణానికి (Kamareddy Town) చెందిన షకీల్ చిన్న వయస్సులోనే కుటుంబ బాధ్యతలు చేపట్టి, కష్టపడి పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తూనే చదువుకున్నాడు.

Kamareddy | ఉస్మానియా నుంచి గోల్డ్​ మెడల్​ సాధించి..

ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) నుంచి ఎంఏ హిందీలో గోల్డ్ మెడల్ సాధించాడు. తర్వాత మౌలానా ఆజాద్ కేంద్రీయ ఉర్దూ విశ్వవిద్యాలయం నుండి ఎంఫిల్​ చేశాడు. 2012లో హిందీ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని సాధించి తన చదువును ఆపకుండా ముందుకు సాగాడు. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి హిందీలో పీహెచ్‌డీ పట్టా సాధించాడు. విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ హిందీ విభాధ్యక్షురాలు ప్రొఫెసర్ మాయదేవి మార్గదర్శకత్వంలో ఈ డాక్టరేట్ పూర్తి చేశాడు.

Kamareddy | చదువే జీవితానికి మార్గదర్శకం..

ఈ సందర్భంగా షకీల్ మాట్లాడుతూ.. చదువు మన జీవితానికి మార్గదర్శకమన్నారు. కష్టాలు ఎదురైనా, స్వయం ప్రయత్నాలతో ఏదైనా సాధ్యమేనని తన అనుభవాన్ని పంచుకున్నారు. పీహెచ్​డీ పట్టా (PhD degree) పొందిన సందర్భంగా తోటి ఉపాధ్యాయులు, మిత్రులు, కుటుంబ సభ్యులు షకీల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.