ePaper
More
    HomeజాతీయంNoida Airport | పనుల్లో జాప్యం.. రోజుకు రూ.10 లక్షల జరిమానా వేస్తున్న ప్రభుత్వం

    Noida Airport | పనుల్లో జాప్యం.. రోజుకు రూ.10 లక్షల జరిమానా వేస్తున్న ప్రభుత్వం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Noida Airport | ప్రభుత్వ పనులు దక్కించుకున్న కంపెనీలు ఆయా పనులను చాలా సందర్భాల్లో నిర్ణీత గడువులోగా పూర్తిచేయవు. దీంతో ప్రభుత్వాలు కంపెనీలకు గడువు పెంచుతాయి. పనుల్లో వేగం పెంచాలని ఆదేశిస్తాయి. కానీ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం UP Govt పనుల్లో జాప్యం చేసినందుకు సదరు కంపెనీకి రోజుకు రూ.10 లక్షల చొప్పున జరిమానా విధిస్తోంది.

    ఉత్తర ప్రదేశ్​లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం Noida Airport పనులను టాటా tata ప్రాజెక్ట్​ కంపెనీ దక్కించుకుంది. అయితే పనులు సెప్టెంబర్​ 2024 వరకు పూర్తి కావాల్సి ఉంది. కానీ కోవిడ్​ కారణంగా జాప్యం జరిగిందని కంపెనీ చెప్పడంతో మరో మూడు నెలలు ప్రభుత్వం గడువు పెంచింది. డిసెంబర్​లోపు కూడా పనులు పూర్తికాకపోవడంతో ఏప్రిల్​లోపు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే కంపెనీ ఏప్రిల్​ వరకు కూడా ఎయిర్​పోర్ట్​ పనులు పూర్తిచేయలేదు.

    Noida Airport | సీఎం యోగి ఆగ్రహం

    నోయిడా ఎయిర్​పోర్ట్​ పనులను గడువులోగా పూర్తి చేయకపోవడంతో సీఎం యోగి ఆదిత్యానాథ్ UP CM Yogi​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కంపెనీకి జనవరి 1 నుంచి పనులు పూర్తయ్యే వరకే రోజుకు రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఆ కంపెనీ రోజు రెండు వేల మంది వర్కర్స్​ను అదనంగా నియమించుకొని పనులు వేగవంతంగా చేపడుతోంది. జూన్​ 30 వరకు విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తోంది.

    More like this

    Revanth meet Nirmala | కళాశాల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...