అక్షరటుడే, వెబ్డెస్క్ : MLA Sudarshan Reddy | ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి శనివారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ప్రభుత్వం సుదర్శన్రెడ్డి(MLA Sudarshan Reddy)ని ఇటీవల ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రిని కలిసి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సీఎం సుదర్శన్రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), జిల్లాకు చెందిన నాయకులు తాహెర్ బిన్ హందాన్, మానాల మోహన్రెడ్డి, ఈరవత్రి అనిల్, ముత్యాల సునీల్రెడ్డి, నగేశ్రెడ్డి, కేశ వేణు తదితరులు పాల్గొన్నారు.
