అక్షరటుడే, వెబ్డెస్క్ : Amrit Express | కేంద్ర ప్రభుత్వం బీహార్కు గుడ్న్యూస్ చెప్పింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఆ రాష్ట్రానికి 13 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను మంజూరు చేసింది.
బీహార్లో ఈ ఏడాది చివరి వరకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఎలాగైనా గెలవాలని ఎన్డీఏ భావిస్తోంది. ఈ మేరకు కేంద్రం బీహార్కు భారీగా నిధులు కేటాయిస్తోంది. తాజాగా 13 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను మంజూరు చేసింది. కాగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఇది నాన్-ఎయిర్ కండిషన్డ్, తక్కువ-ధర, స్లీపర్ కమ్ అన్రిజర్వ్డ్ సర్వీస్.
Amrit Express | రైళ్ల వివరాలు..
- దర్భంగా నుంచి ఆనంద్ విహార్ టెర్మినల్ వరకు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్.
- సహస్ర– లోకమాన్య తిలక్ టెర్మినస్ వరకు.
- రాజేందర్నగర్ టెర్మినల్ నుంచి న్యూ ఢిల్లీ
- బాపుదాం మోతిహరి– ఆనంద్ విహర్
- దర్బాంగ – గోమతి నగర్
- మల్దా టౌన్– గోమతి నగర్
- సీతామర్హి–ఢిల్లీ
- గయా–ఢిల్లీ
- జోగల్బాని–ఈరోడ్
- సహస్ర–చెహర్త (అమృత్సర్)
- ముజఫర్పూర్– చర్లపల్లి (సికింద్రాబాద్)
- చాప్రా–ఢిల్లీ (ఆనంద్ విహార్ టెర్మినల్)
- దర్భంగా–మదార్ (అజ్మీర్).