ePaper
More
    HomeతెలంగాణFarmers | తెలంగాణ రైతాంగానికి గుడ్​న్యూస్​.. రాష్ట్రానికి భారీగా యూరియా కేటాయింపు

    Farmers | తెలంగాణ రైతాంగానికి గుడ్​న్యూస్​.. రాష్ట్రానికి భారీగా యూరియా కేటాయింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Farmers | తెలంగాణ రైతాంగానికి (Telangana farmers) కేంద్ర ప్రభుత్వం గుడ్​న్యూస్ చెప్పింది. యూరియా కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి భారీగా యూరియా కేటాయించింది. తక్షణమే 50వేల మెట్రిక్​ టన్నుల యూరియాను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. గుజరాత్, కర్ణాటక నుంచి తక్షణమే తెలంగాణకు యూరియా తరలించించాలని ఆదేశించింది.

    రాష్ట్ర రైతాంగానికి ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి యూరియా (urea) సరఫరా పెంచే దిశగా చర్యలు చేపట్టింది. రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరతను తీర్చేందుకు 50వేల మెట్రిక్​ టన్నులను కేటాయించింది. ఈ విషయంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసి చర్చించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్​ వద్ద ఆందోళన సైతం చేపట్టారు. దీంతో కేంద్రం వెంటనే స్పందించి యూరియాను కేటాయించింది. కాగా.. వారం రోజుల్లో తెలంగాణ యూరియా వస్తుందన్న మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు తెలిపారు.

    Farmers | యూరియా కొరతతో ఇక్కట్లు

    రాష్ట్రంలో యూరియా కొరతతో (urea shortage) పలుచోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం సొసైటీల వద్ద బారులు తీరుతున్నారు. వర్షంలో సైతం క్యూలు కడుతున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు యూరియా కొరత సమస్యగా మారింది. దీంతో రైతులు (Farmers) ఎరువుల కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేంద్ర నిర్ణయంతో రైతులకు ఊరట లభించనుంది.

    Latest articles

    Nizamabad | జల్సాలకు అలవాటు పడి చోరీలు.. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు...

    Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల్లో అవకతకవలు.. పంచాయతీ కార్యదర్శిపై వేటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Houses | పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Govt)...

    Mopal | విద్యార్థి అదృశ్యం

    అక్షరటుడే, మోపాల్ : Mopal | మోపాల్​ మండలం కులాస్‌పూర్‌కు చెందిన వరుణ్‌ (16) అనే విద్యార్థి అదృశ్యమైనట్లు...

    Urea Shortage | పురుగు మందులు కొంటేనే యూరియా.. కలెక్టర్​ చెప్పినా మారని తీరు

    అక్షరటుడే, కామారెడ్డి : Urea Shortage | జిల్లాలో యూరియా కొరత (Urea Shortage)తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు....

    More like this

    Nizamabad | జల్సాలకు అలవాటు పడి చోరీలు.. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు...

    Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల్లో అవకతకవలు.. పంచాయతీ కార్యదర్శిపై వేటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Houses | పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Govt)...

    Mopal | విద్యార్థి అదృశ్యం

    అక్షరటుడే, మోపాల్ : Mopal | మోపాల్​ మండలం కులాస్‌పూర్‌కు చెందిన వరుణ్‌ (16) అనే విద్యార్థి అదృశ్యమైనట్లు...