HomeUncategorizedScholarship applications | విద్యార్థులకు గుడ్​న్యూస్​​.. స్కాలర్​షిప్​కు దరఖాస్తుల ఆహ్వానం

Scholarship applications | విద్యార్థులకు గుడ్​న్యూస్​​.. స్కాలర్​షిప్​కు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Scholarship applications | రాష్ట్ర ప్రభుత్వం పోస్ట్​ మెట్రిక్​ విద్యార్థులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కాలర్​షిష్​ల​ కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్​ శ్రీధర్​ ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలో పదో తరగతి పూర్తయి ఇంటర్​, డిగ్రీ, పీజీ వంటి ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్​షిప్​ మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త స్కాలర్​షిప్​ల దరఖాస్తులు, పాత విద్యార్థుల రెన్యూవల్​ కోసం ప్రభుత్వం అవకాశం కల్పించింది.

Scholarship applications | సెప్టెంబర్​ 30 వరకు గడువు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులు సెప్టెంబర్​ 30లోపు స్కాలర్​షిప్​ కోసం ఆన్​లైన్​లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇదివరకే స్కాలర్​షిప్​ పొందుతున్న వారు రెన్యూవెల్ చేసుకోవాలని పేర్కొంది. విద్యార్థుల స్కాలర్​షిప్​ల కోసం ఆయా కాలేజీలు సంబంధిత డేటాను ఈ పాస్​పోర్టల్​లో అప్​లోడ్​ చేయాలని సూచించింది. స్కాలర్​షిప్​ అప్లై చేయడానికి కింది లింక్​ను క్లిక్​ చేయండి..

https://telanganaepass.cgg.gov.in/epassonlinelinks.do