ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Scholarship applications | విద్యార్థులకు గుడ్​న్యూస్​​.. స్కాలర్​షిప్​కు దరఖాస్తుల ఆహ్వానం

    Scholarship applications | విద్యార్థులకు గుడ్​న్యూస్​​.. స్కాలర్​షిప్​కు దరఖాస్తుల ఆహ్వానం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Scholarship applications | రాష్ట్ర ప్రభుత్వం పోస్ట్​ మెట్రిక్​ విద్యార్థులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కాలర్​షిష్​ల​ కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్​ శ్రీధర్​ ఉత్తర్వులు జారీ చేశారు.

    రాష్ట్రంలో పదో తరగతి పూర్తయి ఇంటర్​, డిగ్రీ, పీజీ వంటి ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్​షిప్​ మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త స్కాలర్​షిప్​ల దరఖాస్తులు, పాత విద్యార్థుల రెన్యూవల్​ కోసం ప్రభుత్వం అవకాశం కల్పించింది.

    Scholarship applications | సెప్టెంబర్​ 30 వరకు గడువు

    ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులు సెప్టెంబర్​ 30లోపు స్కాలర్​షిప్​ కోసం ఆన్​లైన్​లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇదివరకే స్కాలర్​షిప్​ పొందుతున్న వారు రెన్యూవెల్ చేసుకోవాలని పేర్కొంది. విద్యార్థుల స్కాలర్​షిప్​ల కోసం ఆయా కాలేజీలు సంబంధిత డేటాను ఈ పాస్​పోర్టల్​లో అప్​లోడ్​ చేయాలని సూచించింది. స్కాలర్​షిప్​ అప్లై చేయడానికి కింది లింక్​ను క్లిక్​ చేయండి..

    https://telanganaepass.cgg.gov.in/epassonlinelinks.do

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...