Rajiv-Yuva-Vikasam
Rajiv Yuva Vikasam | రాజీవ్​ యువ వికాసం దరఖాస్తుదారులకు గుడ్​న్యూస్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Rajiv Yuva Vikasam | రాజీవ్​ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. రాష్ట్రంలోని నిరుద్యోగులకు చేయూత అందించేందుకు ప్రభుత్వం రాజీవ్​ యువ వికాసం(Rajiv Yuva Vikasam) పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. స్వయం ఉపాధి పొందాలనుకునే నిరుద్యోగులకు ఈ పథకంలో భాగంగా రూ.50 వేల నుంచి రూ.నాలుగు లక్షల వరకు రాయితీ రుణాలు ఇవ్వనున్నారు. ఈ పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా 16,25,441 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Rajiv Yuva Vikasam | సిబిల్​ స్కోర్​ అక్కర్లేదు..

సిబిల్​ స్కోర్(CIBIL Score)​ లేకుంటే రాజీవ్​ యువ వికాసం కోసం చేసుకున్న దరఖాస్తులను తిరస్కరిస్తున్నట్లు సోషల్​ మీడియా(Social Media)లో ప్రచారం జరిగింది. గతంలో వివిధ రకాల లోన్లు తీసుకొని చెల్లించని వారి దరఖాస్తులను బ్యాంకర్లు పక్కన పెట్టేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా లోన్​ సకాలంలో చెల్లించకపోతే సిబిల్​ స్కోర్​ పడిపోతుంది.


బ్యాంకులు తాము లోన్లు ఇవ్వడానికి సిబిల్​ స్కోర్​నే చూస్తాయి. తక్కువ స్కోర్​ ఉంటే రుణాలను ఇవ్వవు. రాజీవ్​ యువ వికాసం పథకంలోనూ సిబిల్ తక్కువగా ఉంటే లోన్లు ఇవ్వరని ప్రచారం జరిగింది. దీనిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఖండించారు. లబ్ధిదారుల ఎంపిక కోసం సిబిల్​ స్కోర్​ పరిగణనలోకి తీసుకోమని స్పష్టం చేశారు. దీంతో దరఖాస్తుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Rajiv Yuva Vikasam | అమలు ఎప్పటి నుంచంటే..

రాజీవ్​ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2 నుంచి అమలు చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. లబ్ధిదారుల ఎంపికకు సిబిల్‌ స్కోర్‌, ట్రాక్‌ రికార్డు, రికవరీ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోరని స్పష్టం చేశారు. కాగా ఈ పథకం కోసం ఆన్​లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం సంబంధిత ధ్రువ పత్రాలను ఎంపీడీవో ఆఫీసు(MPDO Office)ల్లో సమర్పించాలని అధికారులు సూచించారు. తాజాగా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగంగా సాగుతోంది. అర్హులను ఎంపిక చేయడం కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ మండల స్థాయిలో దాదాపు 90శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా ఈ పథకం కింద 5 లక్షల మందికి రుణాలు ఇవ్వనున్నట్లు తెలిసింది.

Rajiv Yuva Vikasam | కొత్తవారికి అవకాశం

రాష్ట్రంలో గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్​ రుణాలు అందించేవారు. ప్రభుత్వం వాటి స్థానంలో ప్రభుత్వం రాజీవ్​ యువ వికాసం పథకం(Rajiv Yuva Vikasam Scheme) తీసుకొచ్చింది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎస్సీ, బీసీ, ఐటీడీఏ తదితర సంస్థల రుణాలు పొందిన వారు ఉన్నారని పేర్కొన్నారు. రాజీవ్‌ యువ వికాసంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు.