Homeతాజావార్తలుEPFO | పీఎఫ్ ఖాతాదారులకు గుడ్​న్యూస్.. ఇక నుంచి మొత్తం డబ్బులు తీసుకోవచ్చు

EPFO | పీఎఫ్ ఖాతాదారులకు గుడ్​న్యూస్.. ఇక నుంచి మొత్తం డబ్బులు తీసుకోవచ్చు

EPFO | పీఎఫ్​ చందాదారులకు ఈపీఎఫ్​వో సంస్థ గుడ్​ న్యూస్​ చెప్పింది. ఖాతాలోని వంద శాతం డబ్బులను విత్​డ్రా చేసుకునే అవకాశం కల్పించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : EPFO | కేంద్ర ప్రభుత్వం(Central Government) పీఎఫ్​ చందాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఖాతాల్లోని మొత్తం డబ్బులను విత్​ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది.

దేశవ్యాప్తంగా ఈపీఎఫ్​​వో ఏడు కోట్లకు పైగా చందాదారులు ఉన్నారు. వేతన జీవులు గతంలో తమ అవసరాల నిమిత్తం పీఎఫ్​ ఖాతాల నుంచి డబ్బులు తీసుకునే వారు. అయితే మొత్తం డబ్బులు తీసుకునే వీలు ఉండేది కాదు. తాజాగా ఈపీఎఫ్​వో కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన సెంట్రల్​ బోర్డు ఆఫ్​ ట్రస్టీస్​ సమావేశంలో ఎంప్లాయి, ఎంప్లాయర్​ షేర్​ నుంచి వంద శాతం డబ్బులు తీసుకునే అవకాశం కల్పించారు. గతంలో ఉద్యోగ విరమణ చేసిన సమయంలో, జాబ్​ మానేసినప్పుడు మాత్రమే మొత్తం డబ్బులు తీసుకునే అవకాశం ఉండేది.

EPFO | మరింత సులువుగా..

పీఎఫ్​ డబ్బులు విత్​ డ్రా(PF Money Withdraw) చేసుకోవడానికి నిబంధనలు సైతం ఈపీఎఫ్​వో సడలించింది. అంతేగాకుండా పాక్షికంగా డబ్బులు తీసుకోవాలనుకుంటే.. 90శాతం వరకు ఉపసంహరించుకునే అవకాశం కల్పించింది. భూమి, ఇళ్లు కొనుగోలు వంటి అత్యవసర సమయంలో డబ్బులు తీసుకోవాలనుకుంటే గరిష్ఠంగా 90శాతం పొందే విధంగా రూల్స్​ మార్చింది. డబ్బులు తీసుకోవడానికి గతంలో 13 నిబంధనలు ఉండగా.. తాజాగా వాటిని మూడింటికి తగ్గించింది. డబ్బులు తీసుకోవడానికి కనీస సర్వీస్​ కాలాన్ని సైతం 12 నెలలకు తగ్గించింది.

పిల్లల చదువుల(Childrens Education) కోసం పది సార్లు పీఎఫ్​ ఖాతా నుంచి డబ్బులు తీసుకోవచ్చు. అలాగే వివాహ సంబంధిత శుభకార్యాల నిమిత్తం ఐదు సార్లు తీసుకునే అవకాశం కల్పించింది. గతంలో ఈ రెండు అవసరాల కోసం మూడు సార్లు మాత్రమే తీసుకునే అవకాశం ఉండేది. ఈపీఎఫ్​లో భారీగా నగదు నిల్వలు పేరుకుపోవడంతో వాటిని తగ్గించుకోవడానికి ఈపీఎఫ్​వో చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే చందాదారులు నగదు ఉపసంహరించుకోవడానికి నిబంధనలు సడలించింది.