అక్షరటుడే, వెబ్డెస్క్ : EPFO | ఈపీఎఫ్వో సంస్థ ఖాతాదారులకు గుడ్న్యూస్ చెప్పింది. సేవలను మరింత సులభతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది.
దేశంలో ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న కోట్లాది మంది ఈపీఎఫ్వో ఖాతాలు కలిగి ఉన్నారు. ప్రతినెల ఉద్యోగుల జీతం నుంచి పీఎఫ్ ఖాతా (PF Account)లో నగదు జమ అవుతుంది. అయితే ఫీఎఫ్ నిధుల వివరాలు, క్లెయిమ్ల కోసం ఆన్లైన్ ద్వారా సంస్థ సేవలు అందిస్తోంది. అయితే వాటిని మరింత సులభతరం చేసింది. ప్రస్తుతం బ్యాలెన్స్ చెకింగ్ కోసం పాస్బుక్ పోర్టల్ లాగిన్ కావాలి. అదే డబ్బులు విత్ డ్రా చేయడానికి, ఇతర లావాదేవిల కోసం మెంబర్ పోర్టల్ లాగిన్ కావాలి. ఇక నుంచి రెండు సేవలను ఒకే పోర్టల్లో అందించాలని ఈపీఎఫ్వో నిర్ణయించింది.
EPFO | కొత్త ఆప్షన్
ఈపీఎఫ్వో మెంబర్ పోర్టల్లోనే పీఎఫ్ లావాదేవీల వివరాలు తెలుసుకునేలా పాస్బుక్ లైట్ (Passbook lite) పేరుతో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో పాస్బుక్ కోసం ప్రత్యకంగా లాగిన్ కావాల్సిన అవసరం లేదు. సింగిల్ లాగిన్తోనే ఈపీఎఫ్ఓకు సంబంధించిన అన్ని సేవలూ పొందవచ్చని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇక నుంచి మెంబర్ లాగిన్లోనే పీఎఫ్ కాంట్రిబ్యూషన్, విత్డ్రా, బ్యాలెన్స్ వంటి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. అయితే పాస్బుక్ లాగిన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంఉటంది. పూర్తి వివరాలు, గ్రాఫిక్స్తో కూడిన సమాచారం కావాలంటే మాత్రం పాస్బుక్ పోర్టల్ను వినియోగించుకోవచ్చు.
EPFO | వేగంగా సెటిల్మెంట్
పీఎఫ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ కూడా ఇక నుంచి ఆన్లైన్ పోర్టల్లో అందుబాటు ఉండనుంది. గతంలో ఈ సర్టిఫికెట్ కేవలం కార్యాలయాల్లో మాత్రమే ఉండేది. అలాగే పీఎఫ్ విత్డ్రాల కోసం వచ్చిన దరఖాస్తులను సైతం వేగంగా పరిష్కరించడానికి ఈపీఎఫ్వో చర్యలు చేపట్టింది. ప్రస్తుతం పీఎఫ్ బదిలీ, సెటిల్మెంట్లు, అడ్వాన్సులు, రిఫండ్ తదితర సేవల కోసం ఆర్పీఎఫ్సీ/ ఆఫీసర్-ఇన్-ఛార్జి స్థాయి అధికారుల ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇక నుంచి ఈ బాధ్యతలను అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్, సబార్డినేట్ స్థాయి ఉద్యోగులకు అప్పగించారు. దీంతో వేగంగా సెటిల్మెంట్లు పూర్తయి ఖాతాదారుల సమయం ఆదా అవుతుందని సంస్థ తెలిపింది.