ePaper
More
    HomeజాతీయంVande Bharat | ప్రయాణికులకు గుడ్​న్యూస్.. ‘వందే భారత్​’లో బోగీలు డబుల్​

    Vande Bharat | ప్రయాణికులకు గుడ్​న్యూస్.. ‘వందే భారత్​’లో బోగీలు డబుల్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Vande Bharat | కేంద్ర ప్రభుత్వం వేగవంతమైన ప్రయాణం కోసం వందే భారత్​ రైళ్లను (Vande Bharat trains) అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునిక సౌకర్యాలను ఈ రైళ్లలో సమకూర్చింది. రద్దీ అధికంగా ఉండే పెద్ద నగరాల మధ్య ప్రస్తుతం వీటిని నడుపుతోంది. అయితే పలు మార్గాల్లో వందే భారత్​ రైళ్లకు మంచి స్పందన వస్తోంది. దీంతో రైల్వేశాఖ ప్రయాణికుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. వందే భారత్​ రైళ్లలో బోగీలు పెంచాలని నిర్ణయించింది.

    హైదరాబాద్​ నుంచి బెంగళూరుకు (Hyderabad to Bangalore) నిత్యం వేలమంది రాకపోకలు సాగిస్తారు. దీంతో హైదరాబాద్​లోని కాచిగూడ నుంచి బెంగళూరులోని యశ్వంత్​పూరకు ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే వందే భారత్​ రైలును నడుపుతోంది. ఈ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) 2023 సెప్టెంబర్‌ 28న వర్చువల్​గా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ట్రైన్​ ఎనిమిది బోగీలతో 530 మంది సిటింగ్‌ సామర్థ్యంతో సర్వీసులందిస్తోంది. అయితే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండడంతో వందేభారత్​లో సీట్లకు డిమాండ్​ ఉంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ బోగీల సంఖ్యను డబుల్​ చేయాలని నిర్ణయించింది. జులై 10 నుంచి ఈ మార్గంలో వందే భారత్​ 16 కోచ్​లతో నడవనుంది.

    READ ALSO  Vice President | ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా..

    Vande Bharat | డిమాండ్​ ఎక్కువగా ఉండడంతో..

    కాచిగూడ–యశ్వంత్​పుర–కాచిగూడ మార్గంలో వందే భారత్​కు డిమాండ్​ అధికంగా ఉంది. అంతేగాకుండా వందశాతం ఆక్యూపెన్సీ నమోదవుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న 8 బోగీలను 16కు పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. ప్రస్తుతం 530 మంది వెళ్లే అవకాశం ఉండగా బోగీల పెంపుతో ప్రయాణికుల సీటింగ్​ సామర్థ్యం 1,128 కు పెరగనుంది. కాగా జులై 10 నుంచి 14 చైర్ కార్లు కోచ్​లు, రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లతో ఈ మార్గంలో వందే భారత్​ రైలు నడవనుంది.

    కోచ్​లు డబుల్​ చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ రైలు వారంలో ఆరు రోజులు నడుస్తుంది. బుధవారం మినహా మిగతా రోజుల్లో సేవలు అందిస్తోంది. కాచిగూడ నుంచి యశ్వంత్​పురకు (Kacheguda to Yeshwantpur) 612 కిలోమీటర్ల దూరం ఉండగా.. 8 గంటల 15 నిమిషాల్లో చేరుకుంటుంది. మధ్యలో నాలుగు స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. మహబూబ్​నగర్, కర్నూల్​ సిటీ, అనంతపురం, ధర్మవరం స్టేషన్లలలో వందేభారత్​కు స్టాప్​ ఉంది.

    READ ALSO  Kanwar Yatra | కన్వర్​ యాత్రికులపై ఆగని ఆగడాలు..! సుప్రీంకోర్టు జోక్యం.. యూపీ సర్కారు కీలక నిర్ణయం..

    Latest articles

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...

    Kamareddy | బైకు దొంగల అరెస్టు.. ఐదు వాహనాల స్వాధీనం

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : పలు ఏరియాల్లో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి...

    Bandi Sanjay | బండి సంజయ్​పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

    అక్షరటుడే, హైదరాబాద్: Bandi Sanjay | భాజపా సీనియర్​ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay...

    More like this

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...

    Kamareddy | బైకు దొంగల అరెస్టు.. ఐదు వాహనాల స్వాధీనం

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : పలు ఏరియాల్లో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి...