ePaper
More
    HomeజాతీయంTraffic Challans | వాహనదారులకు గుడ్​న్యూస్​.. ట్రాఫిక్​ చలాన్లపై 50శాతం డిస్కౌంట్​.. ఎక్కడంటే?

    Traffic Challans | వాహనదారులకు గుడ్​న్యూస్​.. ట్రాఫిక్​ చలాన్లపై 50శాతం డిస్కౌంట్​.. ఎక్కడంటే?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Traffic Challans | వాహనదారులు నిబంధనలు పాటించకపోతే పోలీసులు జరిమానాలు వేస్తారు. హెల్మెట్ పెట్టుకోకున్నా.. రాంగ్​సైడ్​ డ్రైవింగ్​, ట్రిపుల్​ రైడింగ్​, అతి వేగంగా వాహనాలు నడపడం తదితర కారణాలతో పోలీసులు చలాన్లు (Fines) వేస్తుంటారు. చలా నగరాలు, పట్టణాల్లో కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా కంట్రోల్​ రూమ్​ నుంచే నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు వేస్తున్నారు.

    పోలీసులు జరిమానాలు వేస్తున్నా.. చాలా మంది వాటిని చెల్లించడం లేదు. కొందరి వాహనాలపై వేల రూపాయల ఫైన్లు పేరుకుపోయాయి. ఇటీవల వరంగల్​ (Warangal)లో పోలీసులు తనిఖీలు చేయగా.. ఓ స్కూటీపై ఏకంగా రూ.45 వేల విలువైన ఫైన్లు ఉన్నాయి. దీంతో పోలీసులు షాక్​ అయ్యారు.

    Traffic Challans | కర్ణాటకలో డిస్కౌంట్​

    వాహనదారులు జరిమానాలు చెల్లించేలా ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు స్పెషల్​ డ్రైవ్​లు చేపడుతాయి. గతంలో తెలంగాణ (Telangana)లో ప్రభుత్వం ట్రాఫిక్​ చలాన్లపై భారీగా డిస్కౌంట్​ ఇచ్చింది. తాజాగా కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) సైతం వాహనదారులకు ఊరట కలిగించే వార్త చెప్పింది. ట్రాఫిక్​ జరిమానాలపై 50శాతం తగ్గింపు అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. పోలీసు శాఖ మొబైల్ ఈ-చలాన్‌లో నమోదైన పెండింగ్ కేసులకు జరిమానా మొత్తంలో 50 శాతం తగ్గింపును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 12లోగా జరిమానాలు చెల్లించిన వారికి మాత్రమే ఈ ఆఫర్​ వర్తిస్తుందని స్పష్టం చేసింది.

    Traffic Challans | తెలంగాణలో సైతం ఇవ్వాలని..

    తెలంగాణలో కూడా ట్రాఫిక్​ జరిమానాలపై డిస్కౌంట్​ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల పోలీసులు నిత్యం వాహనాల తనిఖీ (Vehicle Checks)లు చేపడుతుండటంతో చాలా మంది వాహనాలపై చలాన్లు పేరుకుపోయాయి. అయితే కాంగ్రెస్​ అధికారంలో వచ్చిన కొత్తలో డిస్కౌంట్​ ఇచ్చింది. ప్రస్తుతం మళ్లీ ఇవ్వకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

    కాగా నిబంధనలు పాటించాలని జరిమానా వేస్తున్న ప్రభుత్వం డిస్కౌంట్​ ఇవ్వడం సరికాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. దీంతో వాహనదారుల్లో క్రమశిక్షణ దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఎలాగు డిస్కౌంట్​ ఇస్తుందని చాలా మంది ఫైన్లు కట్టడం లేదు. రాయితీ ఇచ్చినప్పుడే కడతామని అలాగే ఉంటున్నారు.

    Latest articles

    Bhatti Vikramarka | త్వరలో మండలానికో అంబులెన్స్​ : డిప్యూటీ సీఎం భట్టి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhatti Vikramarka | తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ...

    Nizamabad City | దేవాలయ భూములు కాపాడాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | దేవాలయ భూములను కాపాడాలని దేవాలయ పరిరక్షణ సమితి (Devalaya parirakshna Samithi)...

    Mla Laxmi Kantha Rao | మౌలిక వసతులు మెరుగుపర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం..: ఎమ్మెల్యే

    అక్షరటుడే, నిజాంసాగర్ ​: Mla Laxmi Kantha Rao | గ్రామాల్లో మౌలిక వసతులను మెరుగుపర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం...

    Banswada | సమస్యలను పరిష్కరించాలని తహశీల్దార్​కు వినతి

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | మోస్రా మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని తహశీల్దార్​ రాజశేఖర్​ను (Tahsildar Rajasekhar) బీజేపీ...

    More like this

    Bhatti Vikramarka | త్వరలో మండలానికో అంబులెన్స్​ : డిప్యూటీ సీఎం భట్టి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhatti Vikramarka | తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ...

    Nizamabad City | దేవాలయ భూములు కాపాడాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | దేవాలయ భూములను కాపాడాలని దేవాలయ పరిరక్షణ సమితి (Devalaya parirakshna Samithi)...

    Mla Laxmi Kantha Rao | మౌలిక వసతులు మెరుగుపర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం..: ఎమ్మెల్యే

    అక్షరటుడే, నిజాంసాగర్ ​: Mla Laxmi Kantha Rao | గ్రామాల్లో మౌలిక వసతులను మెరుగుపర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం...