ePaper
More
    HomeతెలంగాణRythu Bharosa | రైతులకు గుడ్​న్యూస్​.. రైతు భరోసా పడేది అప్పుడే!

    Rythu Bharosa | రైతులకు గుడ్​న్యూస్​.. రైతు భరోసా పడేది అప్పుడే!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Rythu Bharosa | వానాకాలం సాగుకు సిద్ధం అవుతున్న రైతులకు (Farmers) ప్రభుత్వం గుడ్​న్యూస్​ చెప్పింది. త్వరతో రైతు భరోసా (Rythu Bharosa) జమ చేయడానికి సిద్ధం అవుతోంది. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala Nageswara Rao) కీలక ప్రకటన చేశారు. ఈ నెల 25లోపు రైతు భరోసా విడుదల చేస్తామని ఆయన తెలిపారు. అయితే ఈ నెల 16 నుంచి రైతు భరోసా విడుదలకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

    Rythu Bharosa | జోరుగా సాగు పనులు

    ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. దీంతో రైతులు సాగు పనుల్లో బిజీగా ఉన్నారు. మరో 15 రోజుల్లో వరినాట్లు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం (Government) సకాలంలో డబ్బులు విడుదల చేస్తే పెట్టుబడికి ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు.

    Rythu Bharosa | ముందు వారికే..

    రైతు భరోసాకు నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆర్​బీఐ నుంచి అప్పు తీసుకున్న ప్రభుత్వం.. మరో రూ.మూడు వేల కోసం ఇండెంట్​ పెట్టింది. ఈ క్రమంలో రైతు భరోసా జమ చేయడానికి ఆర్థిక శాఖ (Finance Department) సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ముందుగా ఎకరాలోపు రైతులకు నిధులు జమ చేయనున్నారు. అనంతరం రెండు, మూడు ఎకరాలలోపు రైతులకు విడతల వారీగా రైతు భరోసా జమ చేయనున్నారు.

    Rythu Bharosa | వారి పరిస్థితి ఏమిటి?

    ప్రభుత్వం యాసంగి సీజన్​లో రైతు బంధును రైతు భరోసాగా మార్చింది. ఎకరాకు గతంలో రూ.5వేలు ఇస్తుండగా రూ.ఆరు వేలకు పెంచింది. అయితే యాసంగి సీజన్​లో నాలుగు ఎకరాల్లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా జమ అయింది. మిగతా వారికి నిధులు జమ చేయలేదు. యాసంగి సీజన్​లో 57 లక్షల రైతులకు 84 లక్షల ఎకరాలకు సంబంధించి రూ.5,058 కోట్లను పంపిణీ చేసింది. బీఆర్ఎస్​ హయాంలో ఎకరాకు రూ.5 వేల చొప్పున సీజన్​కు రూ.7,500 కోట్లు రైతుబంధు ఇచ్చేవారు. కాంగ్రెస్​ మాత్రం సాయాన్ని పెంచిన రూ.5,058 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో వేసింది. దీంతో డబ్బులు జమకాని రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్​ రైతు భరోసాకు విడుదలకు ప్రభుత్వం సిద్ధం అవుతుండటంతో ముందుగా తమకు నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.

    Rythu Bharosa | కొత్త రైతులకు అవకాశం

    కొత్తగా జూన్ ​5లోపు పట్టాపాస్​బుక్​ పొందిన రైతలకు కూడా రైతు భరోసా జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు రైతు భరోసా రాకుండా కొత్త పాస్​బుక్​ పొందిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచింది. దీంతో వ్యవసాయ అధికారులు వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలాగే బ్యాంక్​ అకౌంట్​ మార్చుకోవాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే రైతు భరోసా(Rythu Bharosa) జమ అయిన వారు దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...