Homeతాజావార్తలుWeather Updates | రైతులకు గుడ్​న్యూస్​.. నేటితో వర్షాలు బంద్!

Weather Updates | రైతులకు గుడ్​న్యూస్​.. నేటితో వర్షాలు బంద్!

రాష్ట్రంలో నేటితో వర్షాలు బంద్​ అవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం నుంచి చలి తీవ్రత పెరుగుతుందన్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | వాతావరణ శాఖ​ అధికారులు (Meteorological Department Officers) రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పారు. కొంతకాలంగా నిత్యం వానలు పడుతుండటంతో పంటలు తడిసిపోయి రైతులు (Farmers) ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో బుధవారంతో వర్షాలు బంద్​ అవుతాయని అధికారులు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఈ వర్షాకాలం సీజన్​లో వానలు దంచికొట్టాయి. అన్ని జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. సాధారణంగా జూన్​ 1 నుంచి అక్టోబర్​ 31 వరకు వర్షాకాలం సీజన్​ ఉంటుంది. అయితే ఈ ఏడాది మాత్రం మే నుంచే వర్షాలు ప్రారంభం అయ్యాయి. రుతుపవనాలు మే నెలలోనే రాష్ట్రాన్ని తాకాయి. అనంతరం జూన్​లో కొద్దిరోజులు వర్షాభావ పరిస్థితులు ఉన్నా.. మిగతా నెలల్లో వానలు కొట్టాయి. వానాకాలం సీజన్​ పూర్తయిన నవంబర్​లో సైతం భారీ వర్షాలు (Heavy Rains) పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో గురువారం నుంచి రాష్ట్రంలో వర్షాలు బంద్ అవుతాయని అధికారులు తెలిపారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలతో ఆరబెట్టిన ధాన్యం, పత్తి తడిసిపోయి అన్నదాతలు అనేక ఇబ్బందులు పడ్డారు.

Weather Updates | నేడు వర్షసూచన

తెలంగాణ (Telangana)లోని వికారాబాద్​, రంగారెడ్డి, మహబూబ్​నగర్​, నాగర్​కర్నూల్​, నల్గొండ, వనపర్తి, గద్వాల్​, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్​, ములుగు జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నం, రాత్రి పూట వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయి. హైదరాబాద్​ (Hyderabad) నగరంలో సైతం మోస్తరు వాన పడే ఛాన్స్​ ఉందని అధికారులు తెలిపారు.

Weather Updates | పెరగనున్న చలి

రాష్ట్రంలో చలికాలం ప్రారంభం అయినా.. ఇంకా వానాకాలాన్ని తలపించేలా వాతావరణం ఉంది. అయితే గురువారం నుంచి వానలు తగ్గి, చలి పెరుగుతుందని అధికారులు తెలిపారు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని పేర్కొన్నారు. చలి తీవ్రత పెరగనున్న నేపథ్యంలో వృద్ధులు, ఆస్తమా రోగులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.