Homeజిల్లాలుకామారెడ్డిSpecial Trains | భక్తులకు గుడ్​న్యూస్​.. అరుణాచలం, శబరిమలకు ప్రత్యేక రైళ్లు

Special Trains | భక్తులకు గుడ్​న్యూస్​.. అరుణాచలం, శబరిమలకు ప్రత్యేక రైళ్లు

శబరిమల, అరుణాచలం క్షేత్రాలకు నిజామాబాద్​ మీదుగా ప్రత్యేక వీక్లి ఎక్స్​ప్రెస్​లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Special Trains | శబరిమల, అరుణాచలం వెళ్లే భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్​ చెప్పింది. ఆయా క్షేత్రాలకు నిజామాబాద్ (Nizamabad) మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి వేలాది మంది భక్తులు అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు వెళ్తుంటారు. వారికోసం ఈ నెల 20 వ తేదీ నుండి వచ్చే సంవత్సరం జనవరి 15 వరకు నాందేడ్ నుంచి కేరళ (Nanded to Kerala)రాష్ట్రంలోని కొల్లం వరకు నిజామాబాదు మీదుగా 07111 ప్రత్యేక వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును నడపనున్నారు. దిగువ మార్గంలో తొమ్మిది ట్రిప్​లు , ఎగువ మార్గంలో కొల్లం నుంచి నాందేడ్ 07112 ప్రత్యేక వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు తొమ్మిది ట్రిప్​లు ( నవంబర్ 22 నుంచి జనవరి 17 ) వరకు నడుస్తాయి . ఈ వీక్లీ ఎక్స్​ప్రెస్ రైళ్లకు నిజామాబాద్​ జంక్షన్ (Nizamabad Junction), కామారెడ్డి రైల్వే స్టేషన్​లలో (Kamareddy railway station) స్టాప్ సదుపాయం కల్పించారు. కాచిగూడ – మహబూబ్ నగర్ – గద్వాల – కర్నూలు – కడప – రేణిగుంట – కాట్​పాడి – ఈరోడ్ – పాలక్కడ్ మీదుగా ఈ రైళ్లు నడుస్తాయి

Special Trains | అరుణాచలం క్షేత్రానికి..

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా నుంచి అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే జోన్ (South Central Railway Zone) నాందేడ్ డివిజన్ అధికారులు ఈ నెల 18 వ తేదీ నుంచి వీక్లీ ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. 07615 నాందేడ్ నుంచి తిరుచిరాపల్లి వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు ఈ నెల 18వ తేదీ నుంచి వచ్చే నెల 30 వరకు దిగువ మార్గంలో ఏడు సర్వీసులు నడుస్తుంది. తిరుచిరాపల్లి నుంచి నాందేడ్ వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ (07616 ) ఈ నెల 19 నుంచి వచ్చే నెల 31 వరకు ఎగువ మార్గంలో 7 సర్వీసులు నడపనున్నారు. ఈ రైలు ఉమ్మడి నిజామాబాద్​ జంక్షన్, కామారెడ్డి రైల్వే స్టేషన్​లలో ఆగనుంది. ఈ రైళ్లు వయా చర్లపల్లి – నల్గొండ – గుంటూరు – తెనాలి – గూడూరు – తిరుపతి – కాట్ పాడి – తిరువణ్ణామలై – శ్రీరంగం మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

Special Trains | పలు రైళ్ల పొడిగింపు

పెద్దపల్లి జంక్షన్ మీదుగా నడిచే నాందేడ్ నుంచి ధర్మవరం వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ (07189) సేవలను 2026 మార్చి 27వ తేదీ వరకు పొడిగించారు. పెద్దపల్లి జంక్షన్ మీదుగా నడిచే నాందేడ్ –తిరుచానూరు (Nanded-Tiruchanur)(07015) వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు సేవలను 2026 మార్చి 29 వరకు పొడిగించారు. మరో 4 నెలలు తిరుపతి వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోగలరు. నాందేడ్ నుంచి తిరుచానూరు (తిరుపతి) వీక్లి ఎక్స్​ప్రెస్​కు ఆర్మూర్ రైల్వే స్టేషన్​లో స్టాప్ సదుపాయం కల్పించాలని ఇక్కడి భక్తులు కోరుతున్నారు. ఈ విషయమై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Must Read
Related News