Homeజిల్లాలుహైదరాబాద్Ganesh Immersion | నగరవాసులకు గుడ్​న్యూస్​.. రాత్రంతా ఎంఎంటీఎస్​ సేవలు

Ganesh Immersion | నగరవాసులకు గుడ్​న్యూస్​.. రాత్రంతా ఎంఎంటీఎస్​ సేవలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ganesh Immersion | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో గణేశ్​ నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శనివారం ఉదయం నుంచి హుస్సేన్​ సాగర్​తో పాటు పలు చెరువుల్లో విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు.

నగరంలోని 20 చెరువులు, పలు కృత్రిమ కొలనుల్లో వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ముఖ్యంగా హుస్సేన్​ సాగర్​కు భారీగా గణనాథులు బారులు తీరాయి. నిమజ్జన శోభాయాత్రతో నగరం అంతా భక్తులతో సందడిగా కనిపిస్తోంది. రేపటి వరకు నిమజ్జనం కొనసాగనుంది.

Ganesh Immersion | ట్రాఫిక్​ ఆంక్షలు

నిమజ్జనం నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్​ ఆంక్షలు (Traffic Restrictions) అమలులో ఉన్నాయి. వినాయక విగ్రహాలు వెళ్లే మార్గంలో ఇతర వాహనాల​ను అనుమతించడం లేదు. నగరంలో ఆదివారం రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్​ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఆర్టీసీ బస్సులను (RTC Bus) సైతం మెహిదీపట్నం, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్‌ వరకే అనుమతిస్తున్నారు. దీంతో భక్తులు ఇళ్లకు చేరడానికి లోకల్​ రైళ్లను అధికారులు నడపనున్నారు.

Ganesh Immersion | 8 ఎంఎంటీఎస్​ రైళ్లు

నిమజ్జనం నేపథ్యంలో భక్తులను క్షేమంగా ఇళ్లకు చేర్చడానికి రాత్రంతా ఎంఎంటీఎస్​ (MMTS) సేవలు అందించాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 4.40 గంటల వరకు MMTS రైళ్లు తిరగనున్నాయి. సికింద్రాబాద్‌-ఫలక్‌ నుమా, సికింద్రాబాద్‌-హైదరాబాద్‌, హైదరాబాద్‌-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా, ఫలక్‌నుమా-సికింద్రాబాద్‌ మధ్య 8 ఎంఎంటీఎస్​ రైల్లు సేవలు అందించనున్నాయి. భక్తుల కోసం మెట్రో రైలు సేవలను సైతం రాత్రి ఒంటి గంట వరకు పొడిగించారు. వాహనాలు అనుమతించకపోవడం, బస్సులు లేకపోవడంతో నగరవాసులు ఎంఎంటీఎస్​, మెట్రో సేవలను వినియోగించుకోనున్నారు. ఆయా రైళ్లలో రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది.

Must Read
Related News