Homeజాతీయం8th Pay Commission | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. 8వ వేతన కమిషన్‌కు కేబినెట్​...

8th Pay Commission | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. 8వ వేతన కమిషన్‌కు కేబినెట్​ ఆమోదం

కేంద్ర కేబినెట్​ కీలక నిర్ణయం తీసుకుంది. 8వ పే కమిషన్​ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఛైర్​పర్సన్​, సభ్యులను నియమించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : 8th Pay Commission | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేబినెట్​ గుడ్​న్యూస్​ చెప్పింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేబినెట్​ కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిదో వేతన కమిషన్‌కు ఆమోదం తెలిపింది.

కేంద్ర మంత్రివర్గం 8వ వేతన కమిషన్​ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ కమిషన్​ 18 నెలల్లోపు సిఫార్సులను సమర్పిస్తుందని పేర్కొంది. 2026 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav) వెల్లడించారు. కేబినెట్​ తాజా నిర్ణయంతో 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. పే కమిషన్‌ ఛైర్​పర్సన్‌గా జస్టిస్‌ రంజనా ప్రకాష్ దేశాయ్‌, సభ్యులుగా ప్రొఫెసర్‌ పులక్‌ గోష్‌, పంకజ్‌జైన్‌ను కేంద్రం నియమించింది.

8th Pay Commission | సంప్రదింపుల తర్వాత..

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సిబ్బందితో సంప్రదింపుల తర్వాత పే కమిషన్​ (Pay Commission)ను ఖరారు చేసినట్లు తెలిపారు. వేతన సంఘం ఏర్పాటుపై రక్షణ, హోం మంత్రిత్వ శాఖలు, సిబ్బంది మరియు శిక్షణ శాఖ, అలాగే రాష్ట్రాలు వంటి ప్రధాన వాటాదారుల నుంచి గతంలోనే కేంద్రం సమాచారం కోరింది. ఈ క్రమంలో తాజాగా పే కమిషన్​ ఏర్పాటు చేశారు.

8th Pay Commission | పెరగనున్న జీతాలు

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాన్ని సవరించడానికి పదేళ్లకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం (Central Government) వేతన కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేస్తుంది. 7వ వేతన కమిషన్ ఫిబ్రవరి 2014లో ఏర్పాటైంది. దాని సిఫార్సులు 2016 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చాయి. లెక్క ప్రకారం.. 8వ వేతన కమిషన్ 2026 జనవరి 1 నుంచి అమలు కావాల్సి ఉంది. కమిషన్ సిఫార్సుల మేరకు జీతాలు పెరగనున్నాయి. అయితే కమిషన్​ 18 నెలలలోపు సిఫార్సులను సమర్పించనుంది. ఆ తర్వాతే జీతాలు పెంచే అవకాశం ఉంది. అయితే 2026 జనవరి 1 నుంచి వేతన కమిషన్​ అమలు చేసి ఉద్యోగులకు పెంచిన వేతనాలు తర్వాత చెల్లిస్తారని సమాచారం.