అక్షరటుడే, ఇందూరు: Gold Thief | ఓ బెంగాలీ కార్మికుడి Bengali worker చేతిలో బంగారు వ్యాపారులు ఘోరంగా మోసపోయారు. పసిడికి మెరుగులద్దే ఆ కార్మికుడికి పెద్ద మొత్తంలో బంగారం ఇచ్చి నిలువు దోపిడీకి గురయ్యారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.
విశ్వసనీయ సమాచారం మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పసిడికి మెరుగులద్దే బెంగాలీ కార్మికుడు ఇక్కడ కొన్నేళ్లుగా షాప్ నడుపుతున్నాడు.
అందరినీ నమ్మబలికాడు. కొన్నేళ్లుగా నమ్మకంగా పనిచేస్తుండటంతో బంగారు వ్యాపారులు, ఆభరణాల తయారీదారులు తాము విక్రయించే బంగారు ఆభరణాలకు అవసరమైన పాలిష్ ఇతడితోనే చేయించుకునేవారు.
Gold trader | పావు కేజీకి పైగా..
అలా, బంగారు వర్తకులు సుమారు పావు కిలోకు పైగా అతగాడికి బంగారం gold ఇచ్చినట్లు తెలిసింది. అసలే గోల్డ్ రేటు చుక్కలను తాకుతోంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున బంగారం చూసేసరికల్లా అతగాడికి కన్నుకుట్టిందేమో.. ఉన్నదంతా పట్టుకుని, పెట్టేబేడా సర్దుకుని పలాయనం చిత్తగించినట్లు ఉన్నాడు.
బెంగాల్ కార్మికుడు ఎత్తుకెళ్లిన బంగారం విలువ రూ. 30 లక్షల వరకు ఉంటుందని అంచనా. నగరంలోని ఒకటో ఠాణా పరిధిలో ఈ గోల్డ్ చోరుడి ఉడాయింపు ఘటన జరిగింది. కాగా, దీనిపై బంగారు వ్యాపారులు ఇంకా బయటకి వచ్చి ఫిర్యాదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.