అక్షరటుడే, వెబ్డెస్క్ : Godavari | ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా (Konaseema district) ముమ్మిడివరం దగ్గర గోదావరిలో విషాదం చోటు చేసుకుంది.
గోదావరిలో స్నానానికి వెళ్లిన 8 మంది యువకులు గల్లంతయ్యారు. కాకినాడ, రామచంద్రపురం (Kakinada, Ramachandrapuram), మండపేటకు చెందిన యువకులు గోదావరిలో స్నానం చేయడానికి వచ్చారు. ఈ క్రమంలో నదిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. గల్లంతైన వారు క్రాంతి, పాల్, సాయి, మహేష్, సతీష్, మహేష్, రాజేష్, రోహిత్గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.