HomeUncategorizedOdisha | బాలిక సజీవ దహనానికి యత్నం.. పరిస్థితి విషమించడంతో విమానంలో ఢిల్లీకి తరలింపు

Odisha | బాలిక సజీవ దహనానికి యత్నం.. పరిస్థితి విషమించడంతో విమానంలో ఢిల్లీకి తరలింపు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Odisha | ఒడిశాలో ఓ బాలికను ముగ్గురు యువకులు సజీవ దహనం చేయడానికి యత్నించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి భువనేశ్వర్​ ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమించింది. దీంతో వైద్యులు ఆమెను విమానంలో ఢిల్లీ ఎయిమ్స్​కు తరలించారు.

ఒడిశాలో పూరి జిల్లా బలంగా పోలీస్ స్టేషన్​ పరిధిలోని నువాగోపాల్​పూర్​ గ్రామ శివారులో 15 ఏళ్ల బాలికపై శనివారం ముగ్గురు దుండుగులు కిరోసిన్​ పోసి నిప్పంటించారు. దీంతో ఆమె కేకలు వేయడంతో స్థానికులు మంటలు ఆర్పి పోలీసుల సాయంతో భువనేశ్వర్​లోని ఎయిమ్స్​కు తరలించారు. ఈ ఘటనలో బాలిక శరీరం 75 శాతం కాలిపోయింది. దీంతో భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బర్న్ సెంటర్‌లో ఐసీయూ ఆమెకు చికిత్స అందించారు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో ఆదివారం విమానంలో ఢిల్లీ ఎయిమ్స్​కు తరలించారు.

ప్రస్తుతం ఆమెను బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ బ్లాక్‌లోని బర్న్ ఐసీయూ చేర్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఆక్సిజన్ సపోర్టుపై వైద్యం అందిస్తున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.