అక్షరటుడే, వెబ్డెస్క్ : Odisha | ఒడిశాలో ఓ బాలికను ముగ్గురు యువకులు సజీవ దహనం చేయడానికి యత్నించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి భువనేశ్వర్ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమించింది. దీంతో వైద్యులు ఆమెను విమానంలో ఢిల్లీ ఎయిమ్స్కు తరలించారు.
ఒడిశాలో పూరి జిల్లా బలంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని నువాగోపాల్పూర్ గ్రామ శివారులో 15 ఏళ్ల బాలికపై శనివారం ముగ్గురు దుండుగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో ఆమె కేకలు వేయడంతో స్థానికులు మంటలు ఆర్పి పోలీసుల సాయంతో భువనేశ్వర్లోని ఎయిమ్స్కు తరలించారు. ఈ ఘటనలో బాలిక శరీరం 75 శాతం కాలిపోయింది. దీంతో భువనేశ్వర్లోని ఎయిమ్స్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ బర్న్ సెంటర్లో ఐసీయూ ఆమెకు చికిత్స అందించారు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో ఆదివారం విమానంలో ఢిల్లీ ఎయిమ్స్కు తరలించారు.
ప్రస్తుతం ఆమెను బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ బ్లాక్లోని బర్న్ ఐసీయూ చేర్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఆక్సిజన్ సపోర్టుపై వైద్యం అందిస్తున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.