ePaper
More
    HomeతెలంగాణCP Sai Chaitanya | ఘరానా దొంగల ముఠా అరెస్ట్

    CP Sai Chaitanya | ఘరానా దొంగల ముఠా అరెస్ట్

    Published on

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్​ కమిషనరేట్​ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య మంగళవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఆరో టౌన్ పోలీస్​స్టేషన్​ పరిధిలో వరుస చోరీ కేసులు నమోదయ్యాయి. ఈ దొంగతనాలను పోలీస్​ శాఖ సీరియస్​గా తీసుకుంది. ఏసీపీ రాజా వెంకట్​రెడ్డి (ACP Raja Venkat reddy) ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి హైదరాబాద్​కు (Hyderabad) చెందిన మహమ్మద్​ అమీర్​గా గుర్తించారు. అతడిని పట్టుకుని విచారించగా ముఠా గుట్టురట్టయ్యింది. మొత్తం 11 మంది ముఠాలో ఉండగా.. 8 మందిని పోలీసులు అరెస్ట్​ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.

    CP Sai Chaitanya | చిన్నచిన్న చోరీలతో మొదలై..

    ముఠాలో ముఖ్యుడైన మహమ్మద్​ అమీర్​​ తొలుత చిన్నచిన్న చోరీలు చేసేవాడు. ఈ క్రమంలో ధర్మపురి హిల్స్​కు చెందిన మహమ్మద్​ అబ్దుల్​ ఆసిఫ్​తో పరిచయం ఏర్పడింది. ఆసిఫ్​ తనకు పరిచయమున్న వసీం, సోహైల్, జావిద్ ఖాన్, రియాజ్, అలీ, ఆసిఫ్ ఖాన్​లను అమీర్​కు పరిచయం చేశాడు. వీరంతా కలిసి నగరలో పలు చోరీలకు పాల్పడ్డారు.

    CP Sai Chaitanya | వీరంతా పాత నేరస్తులే..

    జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠా సభ్యులంతా గతంలో నేరాలకు పాల్పడిన వారే. నగరంలోని ఐదో టౌన్, ఆరో టౌన్, రుద్రూర్ పోలీస్ స్టేషన్, ఆటోనగర్ (Auto Nagar), ధర్మపురి హిల్స్ (Dharmapuri Hills), పెయింటర్ కాలనీ, డ్రైవర్స్ కాలనీ అక్బర్ కాలనీ, శాంతినగర్ కాలనీలలో సుమారు 24కు పైగా ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి వారు ఒప్పుకున్నారు. చోరీ చేసిన బంగారు ఆభరణాలను వారికి పరిచయం ఉన్న మల్కాపూర్​కు చెందిన మోహన్ అనే వ్యక్తికి అమ్మేవారు. వీరందరిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.

    వీరి వద్ద నుంచి 15 తులాల బంగారు ఆభరణాలు, స్విఫ్ట్ డిజైర్ కారు, మూడు బైక్​లు స్వాధీనం చేసుకున్నారు. వీరితోపాటు చోరీలకు పాల్పడిన ఇంకా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్(South Rural CI Suresh Kumar), ఆరో టౌన్ ఇన్​స్పెక్టర్​ వెంకట్రావు, హెడ్ కానిస్టేబుల్ కర్బాజీ, కానిస్టేబుల్ అభిలాష్, సునీల్ కుమార్, శివ సాగర్ గౌడ్, రవి కిరణ్​లను పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులను అందజేశారు.

    More like this

    Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజంపేట ఎస్సైపై వేటు..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎస్పీ రాజేష్​ చంద్ర కొరడా ఝులిపించారు....

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు...

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...