HomeతెలంగాణWarangal | గన్​తో బెదిరించి దారి దోపిడీలు చేస్తున్న ముఠా.. నిందితుల అరెస్ట్​

Warangal | గన్​తో బెదిరించి దారి దోపిడీలు చేస్తున్న ముఠా.. నిందితుల అరెస్ట్​

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో గన్​ చూపెట్టి దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితులను విచారిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Warangal | రాష్ట్రంలో గన్​ కల్చర్​ పెరిగిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల తుపాకులతో దాడులు పాల్పడుతున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఓ ముఠా తుపాకీతో బెదిరించి దారి దోపిడీలకు పాల్పడుతోంది. ముగ్గురు యువకులు ముఠాగా ఏర్పడ్డారు. హైవేలపై వెళ్లే లారీలను లక్ష్యంగా చేసుకొని దోపిడీకి పాల్పడుతున్నారు. అంతేగాకుండా పెట్రోల్​ బంక్​లో సైతం బెదిరింపులకు పాల్పడి దోపిడీలు చేశారు.

Warangal | విచారిస్తున్న పోలీసులు

ఈ ముఠా ఇటీవల హన్మకొండ (Hanmakonda) జిల్లా శాయంపేట (Shayampet) మండలం మందారిపేట సమీపంలో ఓ లారీ డ్రైవర్​ను దోపిడీ చేసింది. పాయింట్​ బ్లాక్​లో గన్​ పెట్టి డబ్బులు లాక్కున్నారు. అనంతరం ఆయనపై దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ లారీ డ్రైవర్ పోలీస్ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేశారు. ఒకరిని హన్మకొండలో, ఇద్దరిని ములుగు (Mulugu) జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా నిందితులు హైదరాబాద్ (Hyderabad)లో పిస్టల్ కొన్నట్లు తెలిసింది.

Warangal | తుపాకులు ఎక్కడివి

ఇటీవల రాష్ట్రంలో తుపాకులతో దోపిడీలు, దాడులు చేపడుతున్న ఘటనలు పెరిగాయి. గతంలో హైదరాబాద్​లోని చందానగర్​లో ఓ ముఠా తుపాకులతో చొరబడి నగల దుకాణంలో చోరీ చేసింది. ఇటీవల మేడ్చల్​ జిల్లా పోచారంలో ఓ వ్యక్తి తుపాకితో గో రక్షకుడిపై కాల్పులు జరిపాడు. తాజాగా వరంగల్​ జిల్లాలో తుపాకీతో దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. అయితే గన్​ కల్చర్​ పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీరికి తుపాకులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే ఆందోళన నెలకొంది.

ప్రస్తుతం స్మార్ట్​ఫోన్​ యుగంతో చాలా మంది యువత వ్యసనాలకు బానిసలుగా మారారు. తక్కువ కాలంలో డబ్బు సంపాదించాని నేరాల బాట పడుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారికి తుపాకులు దొరికితే మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. పోలీసులు స్పందించి రాష్ట్రంలో తుపాకుల విక్రయాలపై చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.