Homeజిల్లాలునిజామాబాద్​Vinayaka Chavithi | గణేష్ మండళ్లు, ప్రైవేట్​ ఎలక్ట్రీషియన్లు నిబంధనలు పాటించాలి: సీపీ

Vinayaka Chavithi | గణేష్ మండళ్లు, ప్రైవేట్​ ఎలక్ట్రీషియన్లు నిబంధనలు పాటించాలి: సీపీ

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Vinayaka Chavithi | గణేష్ మండళ్లు, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు తప్పనిసరిగా పోలీసుల సూచనలు పాటించాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.

మండపాలను విద్యుత్ లైన్ల (Power Lines) కింద, ట్రాన్స్‌ఫార్మర్లకు దగ్గరగా ఏర్పాటు చేయవద్దని సీపీ సూచించారు. మండపాల్లో ఎర్త్​ లీకేజీ సర్క్యూట్​ బ్రేకర్​ (ఈఎల్​సీబీ) (Earth Leakage Circuit Breaker) అవసరమైన ఎంసీబీఎస్​ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మండపాల వైరింగ్‌ను లైసెన్స్ పొందిన ఎలక్ట్రీషియన్ ద్వారానే పూర్తి చేయాలని సూచించారు. వైరింగ్‌లో ఎక్కడా జాయింట్లు లేకుండా చూసుకోవాలని వివరించారు.

Vinayaka Chavithi | సర్వీసు కేబుల్స్​కు హుకింగ్​ చేయవద్దు..

సర్వీస్ కేబుల్స్ హుకింగ్ చేయరాదని, విద్యుత్ వైర్లు ఇనుప పైపులకు తగలకుండా చూడాలని సీపీ వివరించారు. వైర్లు నేలమీద వేయరాదని, తప్పనిసరిగా వేయాల్సివస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Vinayaka Chavithi | సరైన ఎర్తింగ్‌తో త్రీపిన్​ ప్లగ్​లు ఉపయోగించాలి

మండపాల నిర్మాణంలో ఇనుప పైపులు వాడితే వాటిని ఇన్సులేషన్ పదార్థంతో కవర్ చేయాలని పోలీస్​ కమిషనర్​ పేర్కొన్నారు. సర్వీస్ వైర్​ పోల్స్​కు ఫిక్స్ చేసిన తర్వాత, సంబంధిత లైన్‌మన్ లేదా జేఎల్ఎం అనుమతి లేకుండా మార్పులు చేయవద్దని సూచించారు. ఇన్వర్టర్ లేదా జనరేటర్ వాడితే రిటర్న్ కరెంట్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సూచించారు.

Must Read
Related News