అక్షరటుడే, ఇందూరు: Vinayaka Chavithi | వినాయకుల ఉత్సవాల్లో భాగంగా గురువారం 9వ రోజు కావడంతో గణనాథుల నిమజ్జన కార్యక్రమాలు (ganesh Nimajjanam) ప్రారంభమయ్యాయి.
నగరంలోని వినాయక్ నగర్లో (Vinayak nagar) ఉన్న బావి వద్దకు (ganapathula Bavi) భక్తులు తరలివస్తున్నారు. ఈనెల 7న చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో చాలామంది గురువారమే వినాయక నిమజ్జన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
Vinayaka Chavithi | నిమజ్జనానికి పూర్తి ఏర్పాట్లు
ఇదిలా ఉండగా సార్వజనిక్ గణేష్ మండలి (Sarvajanik Ganesh Mandali) ఆధ్వర్యంలో అనంత చతుర్దశి శనివారం రోజు వినాయకులను నిమజ్జనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో దుబ్బ నుంచి ప్రారంభమయ్యే గణపతి రథయాత్రకు సంబంధిత శాఖ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.
దుబ్బ (Dubba), లలితా మహల్ థియేటర్ (Lalita Mahal Theatre), గాంధీ చౌక్ (gandhi Chowk), నెహ్రూ పార్క్ (nehru Park) అహ్మదీబజార్, గాజుల్ పెట్, పెద్ద బజార్, గోల్ హనుమాన్, పులాంగ్ మీదుగా వినాయక్నగర్లోని వినాయకుల బావి వరకు రథయాత్ర కొనసాగనుంది. ఇప్పటికే లైటింగ్, రోడ్డుకు ఇరువైపులా శానిటేషన్ వర్క్, మొరం పనులను చేయిస్తున్నారు. బావి వద్ద నగరపాలక సంస్థ సిబ్బంది, ఆశా వర్కర్లు, వైద్యులను అందుబాటులో ఉంచారు.
వినాయక్నగర్లోని గణపతుల బావిలో గణనాథులను నిమజ్జనం చేస్తున్న భక్తులు
మధవనగర్ చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్