Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | గణేశ్​ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి

Nizamsagar | గణేశ్​ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | గణేశ్​ ఉత్సవాలను ప్రజలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ సూచించారు. ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు డీజే నిర్వాహకులతో శనివారం నిజాంసాగర్ మండలంలోని గోర్గల్​ గేటు వద్ద గల ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

మండపాల వద్ద కచ్చితంగా నిఘా ఏర్పాటు చేయాలని ఎస్సై సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు చోటు ఉండకూడదన్నారు. మద్యం సేవించి మండపాల వద్ద ఉండరాదని, డీజేలు, లౌడ్​ స్పీకర్లతో ఇతరులకు ఇబ్బందులు కలగకుండా మండపాల నిర్వాహకులు తగిన ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శోభాయాత్ర సమయంలో కచ్చితంగా విద్యుత్తు సరఫరాతో పాటు తగు సూచనలు సలహాలు కచ్చితంగా పాటించాలన్నారు. స్నేహపూర్వకమైన వాతావరణంలో గణేశ్​ ఉత్సవాలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆయా గ్రామాలకు చెందిన మండపాల నిర్వాహకులతో పాటు డీజే నిర్వాహకులు పాల్గొన్నారు.