ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad city | ఉత్సాహంగా గాజుల సంబరం

    Nizamabad city | ఉత్సాహంగా గాజుల సంబరం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad city | జిల్లావ్యాప్తంగా గణేశ్​ మండపాల (Ganesh Mandapalu) వద్ద గాజుల సంబరాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు గాజులు వేసుకుంటూ ఉత్సాహంగా ఆడిపాడారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    నగరంలోని ఆనంద్​నగర్​ యువజన గణేశ్​ మండలి (Anandnagar Youth Ganesh mandali) వద్ద శనివారం రాత్రి గాజుల సంబరం నిర్వహించారు. మహిళలంతా ఒకరికొకరు గాజులు వేసుకున్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కాలనీలో నెలకొల్పిన మల్టీ గ్రెయిన్​ గణనాథుడిని నిమజ్జనం నిమిత్తం తరలించారు. ఈ కార్యక్రమంలో ఆనంద్​నగర్​ వెల్ఫేర్ ​సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

    Nizamabad city | ముప్కాల్​లో..

    అక్షరటుడే, ముప్కాల్: మండల కేంద్రంలోని (Mupkal) జీఎన్ఆర్ ఫంక్షన్ హాల్​లో ముప్కాల్ పద్మశాలి సంఘం (Padmashali Sangham) ఆధ్వర్యంలో శనివారం గాజుల సవ్వడి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సంఘంలో గల మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొని ఒకరి చేతులకు మరొకరు గాజులు వేసుకున్నారు. ఆటపాటలతో అలరించారు. సంఘం అధ్యక్షుడు గోపాల్ మాట్లాడుతూ.. మహిళలు ఇలాంటి సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొని, కలిసికట్టుగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సెక్రెటరీ దినేష్, కోశాధికారి రవీందర్, అరుణ్, వెంకటరమణ, కమలాకర్త దితరులు పాల్గొన్నారు.

    More like this

    Tiruma Temple close | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. రేపు తిరుమల ఆలయం మూసివేత

    అక్షరటుడే, తిరుమల: Tiruma Temple close | భాద్రపద పౌర్ణమి Bhadrapada Pournami రోజున అంటే ఈనెల 7న...

    Muslim owns laddu | వినాయకుడి లడ్డూ సొంతం చేసుకున్న ముస్లిం.. వరుసగా రెండోసారి

    అక్షరటుడే, హైదరాబాద్: Muslim owns laddu : గణేశ్​ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. హైదరాబాద్​లో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర...

    Vinayaka Laddu | రికార్డు స్థాయి ధర పలికిన శ్రీ గణేశ్​ మండలి లడ్డూ.. ఏకంగా రూ. 1.65 లక్షల పైనే..

    అక్షరటుడే, ఇందూరు: Vinayaka Laddu : గణేశ్​ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. నిజామాబాద్​ జిల్లాలో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర...