HomeUncategorizedUnion Cabinet | లక్నోలో మెట్రో విస్తరణకు నిధులు మంజూరు.. మరోసారి హైదరాబాద్​కు మొండిచేయి

Union Cabinet | లక్నోలో మెట్రో విస్తరణకు నిధులు మంజూరు.. మరోసారి హైదరాబాద్​కు మొండిచేయి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Union Cabinet | కేంద్ర కేబినెట్​ మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో నాలుగు సెమీ కండక్టర్​ ప్లాంట్ల (Semi Conductor Plants) ఏర్పాటుకు రూ.4,594 కోట్లు మంజూరు చేసింది. ఒడిశా, పంజాబ్​, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో సెమీ కండక్టర్​ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే బీహార్​ రాజధాని పాట్నలో మెట్రో (Patna Metro) విస్తరణకు సైతం నిధులు మంజూరు చేసింది.

బీహార్​లో అసెంబ్లీ ఎన్నికలు (Bihar Elections) ఈ ఏడాది చివరలో జరగనున్నాయి. ప్రస్తుతం జేడీయూ, బీజేపీ కలిసి అధికారంలో ఉన్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని ఎన్​డీఏ భావిస్తోంది. ఈ క్రమంలో 2025 బడ్జెట్​లో సైతం బీహార్​కు కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. తాజాగా లక్నోలో మెట్రో ఫేస్​ 1బీ కోసం రూ.5,801 కోట్లు మంజూరు చేయడానికి యూనియన్​ కేబినెట్​ ఆమోదం తెలిపింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్​లోని టాటో –2 హైడ్రాలిక్​ ప్రాజెక్ట్ (Hydralic Project)​ కోసం రూ.8,146 కోట్లు మంజూరు చేసింది.

Union Cabinet | హైదరాబాద్​ ఆశలపై నీళ్లు

హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో మెట్రో రెండో దశకు నిధులు మంజూరు చేయకుండా కేంద్రం మరోసారి మొండిచేయి చూపింది. నగరంలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మెట్రో రెండో దశ పనులు చేపట్టాలని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) యోచిస్తున్నారు. ఈ మేరకు ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి నిధులు మంజూరు చేయాలని పలుమార్లు కోరారు. అయితే తాజాగా బీహార్​కు నిధులు మంజూరు చేసిన కేంద్రం తెలంగాణ గురించి పట్టించుకోలేదు. బీహార్​లో ఎన్నికలు ఉండటంతోనే నిధులు మంజూరు చేశారనే విమర్శలు వస్తున్నాయి.

హైదరాబాద్​ నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. నగరంలో రద్దీ కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మెట్రో రెండో దశ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్​ సమస్య కొంత మేర తగ్గనుంది. అయితే దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం (State Govt) నిధులు విడుదల చేసినా.. కేంద్రం నుంచి సహకారం లభించడం లేదు. లక్నో మెట్రోకు నిధులు, ఏపీలో సెమీ కండక్టర్​ ప్లాంట్​ మంజూరు చేసిన కేంద్ర కేబినెట్​ తెలంగాణ డిమాండ్​పై పట్టించుకోకపోవడం గమనార్హం.

Must Read
Related News