Homeతాజావార్తలుInter Practicals | ఇంటర్​ విద్యార్థులకు అలర్ట్​.. ఇక నుంచి ఫస్టియర్​లోనూ ప్రాక్టికల్స్

Inter Practicals | ఇంటర్​ విద్యార్థులకు అలర్ట్​.. ఇక నుంచి ఫస్టియర్​లోనూ ప్రాక్టికల్స్

ఇంటర్​ విద్యలో పలు మార్పులు చేపడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్​ విద్యార్థులకూ ప్రాక్టికల్​ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Inter Practicals | ఇంటర్​ విద్యార్థులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.​ సైన్స్​ విద్యార్థులకు (Science Students) ప్రస్తుతం సెకండియర్​లోనే ప్రయోగ పరీక్షలు ఉండగా.. వచ్చే ఏడాది నుంచి ఫస్టియర్​ విద్యార్థులకు అమలు చేయనున్నారు.

ప్రస్తుతం ఇంటర్​లో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు (Practical Exams) నిర్వహిస్తున్నారు. వీటిని సెకండియర్​లో నిర్వహిస్తున్నారు. ఎంపీసీ విద్యార్థులకు ఫిజిక్స్​, కెమిస్ట్రీ, బైపీసీలో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్​, కెమిస్ట్రీ సబ్జెక్ట్​లకు ప్రయోగ పరీక్షలు జరుపుతున్నారు. ఒక్కో పరీక్షకు 30 మార్కులు ఉంటాయి. అయితే ఫస్టియర్​లో ప్రయోగ పరీక్షలు లేకపోవడంతో విద్యార్థులు ల్యాబ్​లకు వెళ్లడం లేదు. సెకండియర్​లో మాత్రమే ప్రాక్టికల్స్​ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పులు తేవడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

Inter Practicals | సీఎం ఆమోదం

ఇంటర్​ ఫస్టియర్​ విద్యార్థులకు ప్రాక్టికల్​ పరీక్షలు పెట్టడానికి సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఆమోదం తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఒక్కో సబ్జెక్ట్​ ప్రాక్టికల్​ పరీక్షకు 30 మార్కులు ఉండగా.. వచ్చే ఏడాది నుంచి ఫస్టియర్​లో 15 మార్కులు, సెకండియర్​లో 15 మార్కులతో పరీక్షలు పెడతారు.

Inter Practicals | ఇంటర్నల్​ మార్కులు

ఇంటర్​లో ఇక నుంచి అన్ని సబ్జెక్టుల్లో 80 శాతం మార్కులకే రాత పరీక్ష ఉంటుంది. 20 శాతం మార్కులు ఇంటర్నల్​ పరీక్షల ద్వారా కేటాయిస్తారు. ప్రస్తుతం ఇంగ్లిష్​ సబ్జెక్ట్​కు మాత్రమే ఇంటర్నల్స్​ ఉండగా.. ఇక నుంచి అన్ని సబ్జెక్టులకు అమలు చేయాలని ఇంటర్​ బోర్డు (Inter Board) నిర్ణయించింది. అలాగే కొత్తగా ఏసీఈ (ఎకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులతో) గ్రూపును అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం సీఈసీ గ్రూపులో సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్ట్​లు ఉన్నాయి.

కాగా.. ఈ ఏడాది ఇంటర్​ పరీక్షల షెడ్యూల్​ను ఇంటర్​ బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి 25 నుంచి ఫస్టియర్​, 26 నుంచి సెకండియర్​ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. గతేడాది మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరిగాయి. అయితే సెకండియర్​ విద్యార్థులకు ఈఏపీసెట్​, ఐఐటీలాంటి ఎంట్రెన్స్​ పరీక్షలకు సిద్ధం కావడానికి వీలుగా పరీక్షలను ముందుకు జరుపుతూ ఇంటర్​ బోర్డు నిర్ణయం తీసుకుంది.