అక్షరటుడే, వెబ్డెస్క్ : FASTag | జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఎన్హెచ్ఏఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అపరిశుభ్రంగా ఉన్న మూత్రశాలలపై రిపోర్టు చేస్తే రూ.వెయ్యి ఫాస్టాగ్ రీఛార్జ్ను (FASTag Recharge) ఉచితంగా అందించనుంది.
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారుల నుంచి ఎన్హెచ్ఏఐ (NHAI) టోల్ వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజల సమయం ఆదా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానం అమలులోకి తెచ్చింది. అయితే ప్రభుత్వం టోల్ వసూలు చేస్తున్న రోడ్లు, హైవేలపై టాయిలెట్స్ (Toilets) బాగుండడం లేదని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా మూత్రశాలల నిర్వహణ సక్రమంగా లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అనేక ఫిర్యాదులు రావడంతో ఎన్హెచ్ఏఐ కీలక చర్యలు చేపట్టింది.
FASTag | రాజ్మార్గ్ యాత్ర యాప్లో..
టోల్ ప్లాజాల (Toll Plaza) వద్ద టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉంటే రిపోర్టు చేసేలా NHAI ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. వినియోగదారులు ‘రాజ్మార్గ్ యాత్ర’ యాప్ ద్వారా అపరిశుభ్రంగా ఉన్న మూత్రశాలల జియో-ట్యాగ్ చేయబడిన చిత్రాలను అప్లోడ్ చేస్తే రూ.1,000 ఫాస్ట్ట్యాగ్ రీఛార్జ్ రివార్డ్ను పొందవచ్చు. అక్టోబర్ 31 వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. రహదారులపై పరిశుభ్రతను మెరుగుపరచడానికి భారత జాతీయ రహదారుల అథారిటీ (NHAI) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
FASTag | ఇలా చేయాలి
వాహనదారులు రాజ్మార్గ్ యాత్ర యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. NHAI పరిధిలోని టోల్ ప్లాజాలలో మురికి టాయిలెట్ల స్పష్టమైన, జియో-ట్యాగ్, టైమ్ టైమ్-స్టాంప్ చేసిన చిత్రాలను అప్లోడ్ చేయాలి. యాప్ ద్వారా యూజర్ పేరు, స్థానం, వాహన రిజిస్ట్రేషన్ నంబర్ (VRN), మరియు మొబైల్ నంబర్తో సహా వివరాలను సమర్పించండి. మురికి టాయిలెట్లను నివేదించే ప్రతి VRN రూ.వెయ్యి ఫాస్ట్ట్యాగ్ రీఛార్జ్కు అర్హత పొందుతుంది. ఈ రివార్డు ఫాస్టాగ్ (FASTag) కోసం మాత్రమే వినియోగించుకోవచ్చు.
FASTag | వీటికి మాత్రమే..
ఎన్హెచ్ఏఐ నిర్వహించే టోల్ప్లాజాల వద్ద మూత్రశాలల్లో తీసిన చిత్రాలకు మాత్రమే రివార్డు వస్తుంది. మొత్తం స్కీమ్ వ్యవధిలో ఒక వాహన రిజిస్ట్రేషన్ నంబర్పై ఒక రివార్డు మాత్రమే వస్తుంది. ఒకే టాయిలెట్ బాగాలేదని ఒక రోజు చాలా మంది ఫిర్యాదు చేస్తే మొదట చేసిన వారికి మాత్రమే రివార్డు లభిస్తుంది. మిగతా వారికి రాదు.