Homeజిల్లాలుకామారెడ్డిEx Mla Jajala | ఆరు గ్యారంటీల హామీలతో మోసం: మాజీ ఎమ్మెల్యే జాజాల

Ex Mla Jajala | ఆరు గ్యారంటీల హామీలతో మోసం: మాజీ ఎమ్మెల్యే జాజాల

అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్​ పేర్కొన్నారు. అడ్లూర్​ ఎల్లారెడ్డిలో ఆయన మాట్లడారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Ex Mla Jajala | రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్​ విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో 420 హామీలు ఇచ్చిందని.. వాటిని అమలు చేయడంలో విఫలమైందన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్​ఎస్​ పార్టీ ఆధ్వర్యంలో​ బాకీ కార్డుల కార్యక్రమం చేపట్టామన్నారు. ఇందులో భాగంగా గురువారం సదాశివనగర్ (Sadshivnagar) మండలం అడ్లూరు ఎల్లారెడ్డిలో (Adlur Yelalreddy) కాంగ్రెస్​ బాకీ కార్డుల పంపిణీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) ఆరు గ్యారెంటీల అమలు చేస్తామని 420 హామీలిచ్చిందన్నారు. హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం హామీలను విస్మరించడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.