ePaper
More
    HomeజాతీయంFake Police Station | తెరపైకి మరో మోసం.. ఏకంగా ఫేక్​ పోలీస్ స్టేషన్​నే పెట్టేశారు..!

    Fake Police Station | తెరపైకి మరో మోసం.. ఏకంగా ఫేక్​ పోలీస్ స్టేషన్​నే పెట్టేశారు..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ప్రపంచంలో ఎక్కడా లేని వింత వింత మోసాలు ఉత్తర్​ప్రదేశ్​లో ​(Uttar Pradesh) వెలుగుచూస్తున్నాయి. మొన్న నకిలీ రాయబార కార్యాలయం (fake embassy) బయటపడగా.. తాజాగా నకిలీ పోలీస్​ స్టేషన్​ వెలుగు చూసింది. నకిలీ ఐడీ కార్డులు, ధ్రువపత్రాలతో పోలీసుల అవతారమెత్తారు కేటుగాళ్లు. ఆరుగుగు ఉన్న ఈ ముఠా ఎట్టకేలకు ఒరిజినల్​ పోలీసులకు చిక్కింది.

    నోయిడాలోని (Noida) సెక్టార్ 70లో ఈ ఘటన వెలుగుచూసింది. ‘ఇంటర్నేషనల్ పోలీస్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’ పేరుతో ఓ కార్యాలయం ఓపెన్​ అయింది. కార్యాలయం బయట బోర్డులు పెట్టారు. నిజమైన పోలీస్ స్టేషన్ మాదిరిగా అన్ని హంగులు సమకూర్చారు.

    Fake Police Station : సమాచారం అందడంతో..

    ఫేక్​ పోలీస్​ స్టేషన్​ ఏర్పాటు చేసిన పది రోజులకు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏమిటీ కార్యాలయం అంటూ అసలైన పోలీసులు తనిఖీలకు వచ్చారు. ఫేక్​ పోలీస్​ స్టేషన్​లో సోదాలు చేపట్టారు. వీరి తనిఖీలో దిమ్మ తిరిగే విషయాలు వెలుగుచూశాయి.

    Fake Police Station : ఎన్నో రకాలు..

    ఫేక్ పోలీసు స్టేషన్​ను తనిఖీ చేసిన పోలీసులు.. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సెల్​ఫోన్లు, చెక్​ బుక్స్, రబ్బర్​ స్టాంప్స్, ఏటీఎం కార్డ్స్, లెటర్​ ప్యాడ్స్, ఐడీ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు.

    వీటికితోడు.. పలు కేంద్ర మంత్రిత్వ శాఖల ఫోర్జరీ ధ్రువపత్రాలు, పోలీసు డిపార్టుమెంట్​ లోగోలు, అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్, ఇంటర్​పోల్​ లాంటి సంస్థలతో అనుసంధానమైనట్లు ఉన్న ధ్రువపత్రాలు, అధికారిక స్టాంపులు వెలుగు చూడడంతో పోలీసులు షాక్​ అయ్యారు.

    వీటికితోడు బ్రిటన్​లో కూడా తమకు కార్యాలయం ఉందని వారు పేర్కొనడంతో పోలీసులు అవాక్కయ్యారు. ప్రభుత్వ అధికారులుగా పేర్కొంటూ.. ఆన్​లైన్ వెబ్​సైట్​ ద్వారా విరాళాలను సైతం సేకరించినట్లు విచారణలో తేలింది. ఆరంభంలోనే ఈ నకిఖీ పోలీసు ముఠా గుట్టురట్టు చేశామని పోలీసులు పేర్కొన్నారు. వీరి బారిన పడిన బాధితులను గుర్తిస్తున్నట్లు వెల్లడించారు.

    రూ. 300 కోట్ల కుంభకోణం..

    గజియాబాద్​లో కొన్ని రోజుల కిందటే ఓ నకిలీ రాయబార కార్యాలయం వెలుగు చూసింది. ఈ కేసులో నిందితుడు హర్షవర్ధన్ జైన్ రూ.300 కోట్ల కుంభకోణం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతగాడికి విదేశాల్లో పదుల సంఖ్యలో బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు తేలింది. గత పదేళ్లలో హర్షవర్ధన్​ 162 సార్లు విదేశీ పర్యటనలు చేసినట్లు వెల్లడైంది.

    Latest articles

    World Cup Qualifiers | అండర్-19 వరల్డ్ కప్ అమెరికాస్ క్వాలిఫయర్స్‌లో సంచలనం.. ఐదు బంతుల్లో ముగిసిన మ్యాచ్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: World Cup Qualifiers | ప్రపంచ క్రికెట్‌లో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిర్భవించింది. అండర్-19 వరల్డ్ కప్...

    NZB CP | ఉర్సు ఉత్సవాలు.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

    అక్షరటుడే, బోధన్: NZB CP | నిజామాబాద్​ జిల్లా (Nizamabad district) బోధన్ పట్టణంలో జలాల్బుకారి దర్గా ఉర్సు...

    BJP | ‘ప్రతి బూత్ – బీజేపీ బూత్’గా చేయడమే లక్ష్యంగా పని చేస్తాం : బీజేపీ జిల్లా అధ్యక్షుడు

    అక్షరటుడే, ఇందల్వాయి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును (BJP State President Ramchandra Rao) సోమవారం (ఆగస్టు...

    Supreme Court | పెరిగిపోయిన వీధి కుక్కలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: ఢిల్లీ - ఎన్సీఆర్​ ప్రాంతాల్లోని (Delhi-NCR areas) దారులపై వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ...

    More like this

    World Cup Qualifiers | అండర్-19 వరల్డ్ కప్ అమెరికాస్ క్వాలిఫయర్స్‌లో సంచలనం.. ఐదు బంతుల్లో ముగిసిన మ్యాచ్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: World Cup Qualifiers | ప్రపంచ క్రికెట్‌లో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిర్భవించింది. అండర్-19 వరల్డ్ కప్...

    NZB CP | ఉర్సు ఉత్సవాలు.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

    అక్షరటుడే, బోధన్: NZB CP | నిజామాబాద్​ జిల్లా (Nizamabad district) బోధన్ పట్టణంలో జలాల్బుకారి దర్గా ఉర్సు...

    BJP | ‘ప్రతి బూత్ – బీజేపీ బూత్’గా చేయడమే లక్ష్యంగా పని చేస్తాం : బీజేపీ జిల్లా అధ్యక్షుడు

    అక్షరటుడే, ఇందల్వాయి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును (BJP State President Ramchandra Rao) సోమవారం (ఆగస్టు...