Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad CP | మల్టీలెవల్​ మార్కెటింగ్ పేరుతో మోసాలు.. ఇద్దరి అరెస్ట్​

Nizamabad CP | మల్టీలెవల్​ మార్కెటింగ్ పేరుతో మోసాలు.. ఇద్దరి అరెస్ట్​

మల్టీలెవల్​ మార్కెటింగ్​ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. సీపీ సాయిచైతన్య సోమవారం వివరాలు వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad CP | లక్కీ జనరల్ ఇండియా జాబ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) వివరాలు వెల్లడించారు.

ఎల్జీ ఇండియా పేరుతో ఉన్న యాప్​లో పెట్టుబడి పెట్టి మోసపోయానని రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామానికి (Satapur village) చెందిన పిట్ల మధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. నగరంలోని ముబారక్​నగర్​కు చెందిన మేకల జగదీష్​, సాటాపూర్​నకు చెందిన పెద్ద భూమయ్య అలియాస్​ ప్రేంను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్వారా ఎల్జీ ఇండియా యాప్​న​కు (LG India app) సంబంధించిన వివరాలు సేకరించారు.

మేకల జగదీష్​, ప్రేం అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఎల్జీ ఇండియా యాప్​లో రూ.25,500 డిపాజిట్​ చేసి రోజుకు 16 వీడియోలను క్లిక్​ చేస్తే వీడియోకు రూ.55 చొప్పున లాభం వస్తుందని పలువురిని నమ్మించారు. దీంట్లో భాగంగా ఇతరులను ఈ యాప్​లో జాయిన్​ చేస్తే 8 మందికి గాను రూ.4వేలు, 15మంది దాటితే రూ.8వేలు వస్తాయని పేర్కొన్నారు. దీనిని నమ్మిన రెంజల్​ మండలం సాటాపూర్​నకు చెందిన పిట్ల మధు యాప్​లో రూ.25,500 డిపాజిట్​ చేశాడు. అనంతరం లాభాలు వచ్చినప్పటికీ డబ్బు అంతా వ్యాలెట్​లో ఉండిపోతోంది.

చివరకు నిర్వాహకులను నిలదీయగా ముంబయిలో (Mumbai) తమ కంపెనీ మేనేజర్​ రాజు ఉంటాడని ఆయనకు చెప్పి సమస్య పరిష్కరిస్తామని నమ్మబలికారు. కానీ డబ్బులు రాకపోగా తన బ్యాంక్​ అకౌంట్​ సైతం ఫ్రీజ్​ కావడంతో వెంటనే స్థానిక పీఎస్​లో ఫిర్యాదు చేశాడు. నిందితులు ఇదేవిధంగా సాటాపూర్​ గ్రామానికి చెందిన 150మందని సైతం మోసం చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఎల్జీ కంపెనీ యాప్​లో ఇప్పటివరకు రూ.75లక్షలు పెట్టుబడి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ యాప్​ పనిచేయట్లేదని ఎస్పీ తెలిపారు. ప్రజలు ఇలాంటి యాప్​లలో డబ్బులు పెడితే అదనపు ఆదాయం వస్తుందని గుడ్డిగా నమ్మవద్దని ఆయన సూచించారు.