Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | న్యూసెన్స్ కేసులో నలుగురికి జైలు శిక్ష

Nizamabad City | న్యూసెన్స్ కేసులో నలుగురికి జైలు శిక్ష

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | న్యూసెన్స్ చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన నలుగురికి న్యాయస్థానం నాలుగు రోజుల జైలు శిక్ష విధించింది.

ఒకటో టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి (SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 23న అర్ధరాత్రి బ​స్టాండ్​ ఎదురుగా ఉన్న సాయి మెస్​లో (Sai Mess) నగరానికి చెందిన జంగిటి విశాల్, బజ్జుల్వర్ గోవింద్, సందనాల సాయికుమార్, కాలే నవనాథ్ న్యూసెన్స్ (Nuisance) చేసి శాంతి భద్రతలకు ఆటంకం కలిగించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని సిటీ పోలీస్​యాక్ట్​ (City Police Act) కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారిని స్పెషల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్​ (Special Second Class Magistrate) ఎదుట హాజరుపర్చగా ఒక్కొక్కరికి నాలుగురోజుల చొప్పున జైలుశిక్ష విధించారు.

Nizamabad City | న్యూసెన్స్​ చేస్తే కఠినచర్యలు

నగరంలో రద్దీ ఉండే ప్రాంతాల్లో న్యూసెన్స్​ చేస్తూ ఇబ్బంది కలిగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఎస్​హెచ్​వో పేర్కొన్నారు. సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు హోటళ్లన్నీ సమయానుసారం మూసివేయాలని.. రాత్రివేళ్లలో సరైన కారణం లేకుండా రోడ్లపై తిరిగితే నిబంధనల ప్రకారం చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు.

Must Read
Related News