HomeతెలంగాణFormula E car race | ఫార్ములా ఈ‌‌‌‌‌‌‌‌–కారు​ రేస్ కేసు.. కేటీఆర్​కు మరోసారి ఏసీబీ...

Formula E car race | ఫార్ములా ఈ‌‌‌‌‌‌‌‌–కారు​ రేస్ కేసు.. కేటీఆర్​కు మరోసారి ఏసీబీ నోటీసులు..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Formula E car race | ఫార్ములా ఈ–కారు రేస్ కేసులో కేటీఆర్​కు (KTR) మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. రెండోసారి విచారణకు హాజరు కావాలని ఏసీబీ (ACB) శుక్రవారం నోటీసులిచ్చింది. ఫార్ములా ఈ–కారు రేస్ కేసులో సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని పేర్కొంది. కేసీఆర్‌ హయాంలో హైదరాబాద్‌ వేదికగా ఫార్ములా ఈ రేస్‌ నిర్వహించారు. అయితే, ఇందులో అక్రమాలు జరిగాయని, అనుమతి లేకుండా నిధులు విడుదల చేశారనే అభియోగంపై ఏసీబీ విచారణ చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి గత నెల మే 28న విచారణకు హాజరుకావాల్సిందిగా ఏసీబీ కేటీఆర్​కు నోటీసులు పంపింది. అయితే ఆ సమయంలో కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటన ముగిసిన తర్వాత విచారణకు హాజరువుతానని ఏసీబీకి మాజీ మంత్రి సమాచారం ఇచ్చారు. అందుకు అంగీకరించిన అవినీతి నిరోధక శాఖ.. శుక్రవారం మరోసారి కేటీఆర్​కు నోటీసులు పంపింది.

Formula E car race | గతంలో విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

ఫార్ములా-ఈ కార్​ రేసు (Formula E car race) వ్యవహారంలో ఉల్లంఘనలు జరిగాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం (state governmen) విచారణకు ఆదేశించారు. పోటీ నిర్వహణ సంస్థకు ఏకపక్షంగా చెల్లింపులు జరగడం, రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు నిధుల బదిలీ చేయడంతో విచారణ చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏసీబీకి లేఖ రాయడంతో కేసును అవినీతి నిరోధక శాఖ (Anti-Corruption Department) విచారిస్తోంది.

Formula E car race | 2023లో పోటీలు

2023 సంవత్సరంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లో (Hyderabad) ఫార్ములా–ఈ కార్​ రేసు పోటీలు జరిగాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ ఏర్పాటు చేసిన 2.8 కిలోమీటర్ల ట్రాక్​లో 2023 ఫిబ్రవరి 10,11 తేదీల్లో మొదటి ఫార్ములా-ఈ కార్​ రేసు జరిగింది. ఈ పోటీలకు దేశ వ్యాప్తంగా అభిమానులు హాజరయ్యారు. దీంతో 2024 ఫిబ్రవరి 10న మరో మారు నిర్వహించాలని భావించారు. అయితే 2023 డిసెంబర్​లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress party) అధికారంలోకి వచ్చింది. ఒప్పందంలో పేర్కొన్న అంశాలను పాటించకపోవడంతో తాము హైదరాబాద్ రేస్ నుంచి తప్పుకొంటున్నట్లు అదే నెలలో ఫార్ములా-ఈ ఆపరేషన్స్ ప్రకటించింది.