ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​BB Patil | దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మాజీ ఎంపీ బీబీ పాటిల్

    BB Patil | దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మాజీ ఎంపీ బీబీ పాటిల్

    Published on

    అక్షరటుడే, కోటగిరి: BB Patil | వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. దీంతో జహీరాబాద్ (Zaheerabad) మాజీ ఎంపీ బీబీ పాటిల్ పరిశీలించారు.

    పోతంగల్ (Pothangal) మండలంలోని మంజీర పరీవాహక ప్రాంతాలైన కల్లూర్, కోడిచెర్ల, పొతంగల్, హంగర్గ, కారేగాం, సుంకిని గ్రామాల్లో ఆదివారం పర్యటించి రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీబీ పాటిల్ మాట్లాడుతూ.. నష్టపోయిన రైతుల పంట పొలాలను అధికారులు పరిశీలించి, వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

    తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫసల్ యోజన (Fasal Yojana Scheme) అమలు చేస్తే రైతులకు బీమా వర్తించేదన్నారు. రాష్ట్రంలో ఫసల్ యోజన బీమా అమలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షులు కల్లూరి హన్మాండ్లు (బజరంగ్) ఎముల నవీన్, హరి కృష్ణ, బాన్సువాడ బీజేపీ నాయకులు, ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్, బీజేపీ నాయకులు ప్రకాష్ పటేల్, విజయ్ పటేల్, గంగాధర్ పటేల్, పబ్బ శేఖర్, దిగంబర్ పటేల్, సంజు మహారాజ్, ఓమన్న పటేల్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Heavy Rains | మాయదారి వాన.. వర్ష బీభత్సంపై కవి ఆవేదన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | కామారెడ్డి జిల్లాలో 15 రోజుల క్రితం వర్షం బీభత్సం సృష్టించిన...

    GST | దిగిరానున్న ధరలు.. నిలిచిన కొనుగోళ్లు.. జీఎస్టీ శ్లాబ్‌ మార్పుతో తగ్గనున్న ధరలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST | కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ(GST)లో తీసుకువచ్చిన సంస్కరణల(Reforms)తో వివిధ వస్తువుల ధరలు తగ్గనున్నాయి....

    Mla Prashanth Reddy | చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి: Mla Prashanth Reddy | విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్...