అక్షరటుడే, వెబ్డెస్క్ : Harish Rao | బతుకు దెరువు కోసం జోర్డాన్ వెళ్లి చిక్కుకున్న 12 మందిని మాజీ మంత్రి హరీశ్రావు స్వస్థలానికి చేర్చారు. జోర్డాన్లో వారు పనిచేసే కంపెనీకి పెనాల్టీతో పాటు, రవాణా ఖర్చును భరించి బాధితులను ఆయన హైదరాబాద్కు రప్పించారు.
తెలంగాణ (Telangana)కు చెందిన 12 మంది బతుకు దెరువు కోసం గతంలో జోర్డాన్ వెళ్లారు. అయితే ఏజెంట్ మోసాలకు బలై అక్కడ చిక్కుకుపోయారు. దీంతో తమను కాపాడాలని వేడుకున్నారు. ఈ మేరకు స్పందించిన మాజీ మంత్రి హరీశ్రావు చర్యలు చేపట్టారు. అక్కడి కంపెనీతో మాట్లాడి వారి తరఫున ఆయన పెనాల్టి చెల్లించారు. శనివారం ఉదయం బాధితులు శంషాబాద్ ఎయిర్పోర్టులో చేరుకున్నారు. అనంతరం నేరుగా హరీశ్ రావు ఇంటికి వెళ్లి కలిశారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
Harish Rao | పట్టించుకోని ప్రభుత్వాలు
కాంగ్రెస్ ప్రభుత్వానికి (Congress Government), బీజేపీ ఎంపీలకు ఎన్ని సార్లు తమ సమస్య చెప్పుకున్నా పట్టించుకోలేదని బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు.తమను తిరిగి భారత దేశానికి తీసుకొచ్చిన హరీశ్రావుకు, బీఆర్ఎస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. బాధితులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, అందుకే కేసీఆర్ ఆదేశాల మేరకు వారిని సొంత ఖర్చుతో స్వదేశానికి తీసుకువచ్చామని హరీశ్రావు తెలిపారు.
Harish Rao | వారిని రక్షించాలి
బతుకు దెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఎంతో మంది కార్మికులు ఏజెంట్ల మోసాలకు బలైపోతున్నారని హరీశ్రావు (Harish Rao) ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అలాంటి వారిని రక్షించాలని కోరారు. కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్,మెదక్, సిద్దిపేట, జగిత్యాల జిల్లాలకు చెందిన చాలా మంది గల్ఫ్ దేశాల్లో చిక్కుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సాయం అడిగిన స్పందించలేదన్నారు. తాజాగా జోర్డాన్ (Jordan)లో చిక్కుకున్న 12 మందిని బీఆర్ఎస్ తరఫున జరిమానా కట్టి స్వదేశానికి రప్పించామన్నారు. వందలాది మంది గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) గల్ఫ్ కార్మికులకు అనేక హామీలు ఇచ్చారన్నారు. కానీ ఒకటి కూడా అమలు చేయడం లేదన్నారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay) చొరవ చూపి గల్ఫ్లో చిక్కుకున్న వారిని కాపాడాటానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి, విదేశాల్లో చిక్కుకున్న మన ప్రజలను సురక్షితంగా ఇంటికి చేర్చాలని డిమాండ్ చేశారు.

