అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Former Mayor Sanjay | నిజామాబాద్ నగర (Nizamabad city) అభివృద్ధి కోసం కాంగ్రెస్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అన్నారు. నగరంలోని తన నివాసంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు.
Former Mayor Sanjay | డీఎస్ హయాంలోనే..
డీఎస్ హయాంలో జరిగినే అభివృద్ధి ఇప్పటికీ కనిపిస్తోందన్నారు. కొత్తగా నగరంలో బీఆర్ఎస్, బీజేపీలతో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన పేర్కొన్నారు. డీఎస్ (late former minister DS) ఎప్పుడైతే అనారోగ్యం కారణంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారో అప్పటి నుంచి నగరంలో అభివృద్ధి మందగించిందన్నారు.
Former Mayor Sanjay | విజన్ ఉన్న వ్యక్తి రేవంత్రెడ్డి..
రాష్ట్రంలో విజన్ ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి సీఎంగా (CM Revanth Reddy) ఉన్నారని సంజయ్ అన్నారు. రెండు రోజుల క్రితమే సీఎం నిజామాబాద్కు వచ్చి నిజామాబాద్ అభివృద్ధి బాధ్యత తనదేనని హామీ ఇచ్చారన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించినట్లుగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. మేయర్ పీఠంపై కాంగ్రెస్ అభ్యర్థిని కూర్చోబెట్టాలని సూచించారు.
అర్వింద్ అర్బన్కు ఏం చేశాడు..
నేతలు చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ ముందుకు సాగాలని డీఎస్ అంటుండేవారని సంజయ్ తెలిపారు. ఏమీ చేయని అర్వింద్ (MP Arvind) చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టే నిజామాబాద్ పేరు మార్చాలని పట్టుబడుతున్నాడన్నారు. గతంలో ఇద్దరు ఛైర్మన్లు బీజేపీకి వారే ఉన్నారని.. అప్పుడు పేరెందుకు మార్చలేదని ప్రశ్నించారు. తన హయాంలో నగరంలో అభివృద్ధిలో ఎంత ముందుకు వెళ్లిందో అందరికీ తెలుసన్నారు. తాను చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్దమని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారడానికి బీఆర్ఎస్ పాలనే కారణమని విమర్శించారు. అందువల్లే కాంగ్రెస్ హామీల అమలులో కొంచెం వేగం తగ్గిందని ఆయన స్పష్టం చేశారు.