అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Case | కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project)లో కీలకంగా వ్యవహరించిన మాజీ ఈఎన్సీ మురళీధర్రావు (Former ENC Muralidhar Rao) అక్రమాస్తులు చూసి ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో మంగళవారం ఆయన ఇంటితో పాటు 11 ప్రాంతాల్లో అధికారులు దాడులు (ACB Raids) చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో అధికారులు ఆయన ఆస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
ACB Case | మాజీ ఈఎన్సీ ఆస్తులు..
మురళీధర్రావుకు హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కొండాపూర్లో ఒక విల్లా ఉంది. బంజరాహిల్స్, యూసుఫ్గూడ, బేగంపేట, కోకాపేట ప్రాంతాల్లో ఒక్కో ప్లాట్ ఉన్నాయి. కరీంనగర్, హైదరాబాద్ నగరాల్లో కమర్షియల్ భవనాలు ఉన్నాయి. కోదాడలో ఒక అపార్ట్మెంట్ ఉంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఉండడం గమనార్హం. వరంగల్లో ఒక అపార్ట్మెంట్ నిర్మాణంలో ఉంది. 11 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో నాలుగు ఓపెన్ ప్లాట్లు, మోకిలో 6500 చదరపు గజాల స్థలం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతేగాకుండా మూడు కార్లు, ఇందులో ఒకటి బెంజ్ కారు, భారీగా బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ACB Case | రిమాండ్కు తరలింపు
మాజీ ఈఎన్సీ మురళీధర్రావు ఇళ్లలో సోదాల అనంతరం ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసింది. మురళీధర్రావును కోర్టులో హాజరు పర్చగా జడ్జి రిమాండ్ విధించారు. తనిఖీలు ఇంకా కొనసాగుతాయని ఏసీబీ అధికారులు తెలిపారు. మాజీ ఈఎన్సీ ఆస్తుల విలువ రూ.వందల కోట్ల మేర ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కేసు విచారణ కొనసాగుతుందని తెలిపారు.